ఎన్నికలు మొదలయ్యాలంటే చాలు గంట పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తుంది. గంట ప్రత్యేకత ఏంటంటే గతంలో తాను పోటీ చేసిన సీట్ నుంచి పోటీ చేయరు. ఎన్నికలు ప్రక్రియ మొదలయ్యేది ఆలస్యం కొత్త సీటు కోసం వెతికి ప్రయత్నంలో గంటా శ్రీనివాస్ రావు ఉండిపోతాడు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన గంట ప్రస్తుతం తన కన్ను భీమిలిపై పడింది. కానీ టిడిపి అధిష్టానం భీమిలి నియోజక వర్గం సీట్ కేటాయించడం కుదరదు ,విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అని భావిస్తోంది. దానికి గంట ససేమిరా అంటున్నాడు. టిడిపి అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుపల్లి నుంచే పోటీ చేయాలి అని కోరుతోంది.
అవసరమైతే జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యి భీమిలి నుంచి పోటీ చేస్తాను తప్ప చీపురుపల్లి నుంచి పోటీ చేయను అని తన అనుచర వర్గానికి తెలియజేశాడు. 2004 లో చోడవరం నుంచి, 2009 లో అనకాపల్లి నుంచి, 2014లో భీమిలి నుంచి, 2019లో వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచాడు. ఐదేళ్లకి ఒకసారి స్థానచలనం కోరుకునే గంట శ్రీనివాస్ రావుకి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది.
గంటా శ్రీనివాస్ రావు తన పాత నియోజకవర్గం అయిన భీమిలిలో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా దానికి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం లేదు. దానికి కారణం గంటాకి అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు, సంబంధాలు ఉండడమే. గంట విశాఖ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదం ఉందని టిడిపి అధిష్టానం భావిస్తోంది, ఎందుకంటే వైఎస్ఆర్సిపి నుంచి విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తున్నారు. గంటా శ్రీనివాస్ రావుకి బొత్స సత్యనారాయణకి ఉన్న సత్సoబంధాల దృష్ట్యా ఎమ్మెల్యే ఓటు గంటకి వేయించుకొని ఎంపీ ఓట్లు బొత్స ఝాన్సీకి వేయించే అవకాశం ఉందని బాబు అనుమానపడున్నందున టిడిపి విశాఖ పార్లమెంట్ పరిధిలో టికెట్ నిరాకరిస్తోంది.
గంటా కి పార్టీలు మారడం కొత్తేమి కాదు. 1998లో తెలుగుదేశంతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాడు, 2008లో ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాడు. ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలిపివేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా చేశాడు. కాంగ్రెస్ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చాడు. ఇప్పుడు టీడీపీ టికెట్ నిరాకరిస్తే జనసేనలో చేరడానికి సిద్దంగా ఉన్నాడు.గంటా దారి ఎటు అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో చూడాలి గంటా శ్రీనివాస్ రావు.. చీపురుపల్లి వయా టిడిపి ప్రయాణిస్తాడా.. లేకా భీమిలి వయ జనసేన ప్రయాణిస్తాడా…