2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తప్పకుండా ఓడిపోతామనే భయంతో కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ – జనసేన కూటమి తొలి జాబితా దాదాపు సిద్దమైనట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీని కూడా తమతో కలుపుకోవాలని టీడీపీ – జనసేన కూటమి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో పెద్దగా ఓటు బ్యాంక్ లేని బీజేపీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లించలేదు. కానీ ఇంతలోనే టీడీపీ జనసేన కూటమి తమ తొలి జాబితా సిద్ధం చేయడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసే విషయమనే చెప్పాలి.
టీడీపీ జనసేన కూటమి రూపొందించిన తొలి జాబితాలో టీడీపీకి 45, జనసేనకు14 సీట్లు కేటాయించినట్లుగా సమాచారం. ఇందులో 18 స్థానాలలో టీడీపీ సిట్టింగులే నిలబడతారని, మిగతా 27 చోట్ల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జనసేన ప్రస్తుతానికి 14 నియోజకవర్గాలను ఫైనల్ చేసినట్లుగా చెప్తున్నారు..
జనసేన పోటీ చేసే నియోజకవర్గాలివే..
పిఠాపురం, భీమవరం, కాకినాడ సిటీ,రాజమండ్రి రూరల్,నర్సాపురం, ఆళ్లగడ్డ,తెనాలి,గాజువాక, తిరుపతి,కైకలూరు, అమలాపురం,
రాజోలు,శ్రీకాకుళం, భీమిలీ నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలుస్తుందని విశ్వసనీయ సమాచారం.