ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులతో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. కొద్దికాలం క్రితం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆమెని ఒక ఛానెల్ వారు ప్రభుత్వ పధకాల అమలు తీరు పై ప్రశ్నించినప్పుడు సొంత ఇల్లు తన కలని, అందుకు అవకాశం కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం తనకు ఇంటి స్థలం పట్టా ఇచ్చిందని, అలాగే తాను అమ్మవడి పధకం ద్వారా లబ్ది పొందుతున్నానని చెప్పిన ఆమె, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల ఫలితాలు బావున్నాయని రాబోయే ఎలెక్షన్ లో జగనన్నను గెలిపించుకొంటామనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
అదే ఆమె చేసిన పాపం అయ్యింది. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు ఆమె పై అసభ్య వ్యాఖ్యలతో వికృతమైన దాడి చేసాయి . సభ్య సమాజం వినలేని బూతులతో ఆమెని దూషిస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం వందల కొద్దీ పోస్ట్లు పెట్టింది. ఈ రకమైన దాడిని ఎన్నడూ ఎరగని సాధారణ మహిళ అయిన గీతాంజలి, ఆ అసభ్య వ్యాఖ్యలు చూసి తట్టుకోలేని అవమానంగా భావించి ఆత్మహత్యా యత్నం చేసి మూడు రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది.
దరిమిలా ఆమె మృతికి ప్రభుత్వం సంతాపం తెలియజేయడంతో పాటు అనాధ లైన ఆమె ఇద్దరు బిడ్డల కోసం ఇరవై లక్షల ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం, ఈ ఘటన తర్వాత గీతాంజలికి జరిగిన అన్యాయం బాహ్య ప్రపంచానికి తెలియడంతో రాజకీయాలకి అతీతంగా అన్ని వర్గాల నుండీ తీవ్ర వ్యతిరేకత వచ్చినా టీడీపీ పార్టీ సోషల్ మీడియా తన వైఖరి మార్చుకోకుండా ఆమె స్పీచ్ లో లోపాలు వెదికి తమ నేరాన్ని కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం.
ఆమె మృతికి ప్రభుత్వం సంతాపం తెలియజేయడంతో పాటు అనాధ లైన ఆమె ఇద్దరు బిడ్డల కోసం ఇరవై లక్షల ఆర్ధిక సాయం అందించిన ప్రభుత్వం ఈ ఘటనకు కారణమైన వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోని శిక్షిస్తామని పేర్కొంది. ఆ పై ఈ ఆత్మహత్య వెనకున్న నేరస్తుల పై చర్యలు తీసుకోవాలన్న బీసీ కమిషన్ ఆదేశాల మేరకు ఆమె పై దుష్ప్రచారం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించిన పోలీసు వర్గాలు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు .
ఇందులో భాగంగా గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, బోండా ఉమాకి సన్నిహితుడు అయిన రాంబాబుని విజయవాడ సింగ్ నగర్లో తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారని ప్రాథమిక సమాచారం .