మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్లు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ఇంటిపై తన అనుచరులతో దాడికి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు తనపై వైసీపీ వారు దాడి చేసారంటూ పోలీసులకు పిర్యాదు చేయడం గమనార్హం. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామాంజనేయులు ఒక వీధి రౌడీలా మారి దాడికి పథకం వేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కారు ఎక్కించాలని ప్రయత్నించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓడిపోతున్నామన్న అక్కసుతో బూర్ల రామాంజనేయులు 200 మంది టీడీపీ, జనసేన రౌడీలతో మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ బలసాని కిరణ్కుమార్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటప్పారెడ్డి కాళ్ళ పైకి రామాంజనేయులు తన కారుతో తొక్కించడంతో ఆయన కాలు విరిగింది. కిరణ్కుమార్ డ్రైవర్ ఇంద్రబాబుతో పాటు గోరంట్లకు చెందిన తాళ్ళ అబ్బులు టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు పలాయనం చిత్తగించారు.
ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్కుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు లోక్సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారు రోశయ్య, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, గుంటూరు తూర్పు అభ్యర్థి షేక్ నూరీఫాతిమా, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లాల్పురం రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడటమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పోలీసులకు పిర్యాదు చేయడం రామాంజనేయులకే చెల్లింది. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.