పవన్ కళ్యాణ్ మరియి బాబు కలిసి పోటి చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న తరువాత జనసేన 21 స్థానాల్లో పోటీ అని ప్రకటించారు. దానిలో భాగంగా ఉమ్మడి విశాఖ లో అనకాపల్లి ఎంపీ గా మొదట నాగబాబు పోటి అని లోకల్ గా ఇల్లు తీసుకొని ఒక వారం రోజులు హడావిడీ చేశారు చివరకు పొత్తు లో భాగంగా టికెట్ లేదు అని ఇల్లు ఖాళీ చేసి హైదరబాద్ కు తిరిగి వెళ్ళిపొయ్యారు
ఇక అదే అనకాపల్లి లో ఎంపీ టికెట్ ఇస్తాము అనే హామీతో జన సేన లో జాయిన్ అయిన కొణతాలకు ఎంపీ టికెట్ ఇవ్వలేము అనే తెలిసి అలిగే సరికి చివరకు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అప్పటి వరకు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాకముందు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని జనసేన నేత పరుచూరి భాస్కరరావు గంపెడు ఆశలు పెట్టుకున్నారు , ఇక టికెట్ లేదు అని పార్టీ కి రాజీనామా చేశారు
మరోవైపు గాజువాకలో జనసేన పోటి అని చివరకి టీడీపీకి వదులుకునే సరికి జనసేన నాయకులు గొడవలు చేస్తూ వున్నారు. పెందుర్తిలో జనసేనకు కేటాయింపు జరిగి ఇక్కడ పంచకర్ల రమేష్ పోటి చేస్తారు అని ప్రకటించారు దీనితో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయన పెద్దా ఎత్తులో గొడవకు దిగారు , జనసేన కు సపోర్ట్ చేసేది లేదు అని తెగేసి చెప్పారు .యలమంచిలిలో జన సేనకు టికెట్ కేటాయించారు అని తెలియగానే టీడీపీ కార్యకర్తలు తమ సొంత పార్టీ అఫీస్ ను పగలగొట్టి జనసేన కు సపోర్ట్ చేసేది లేదు అని తేగిసి చెప్పరు
వైజాగ్ సౌత్ లో జన సేన ఇంటి పోరు వీధికి ఎక్కి కొట్టుకుంటున్నారు. వైజాగ్ సౌత్ లో వైఎస్సార్సీపీ నుండి వచ్చిన వంశీ కి టికెట్ ఇవ్వడం తో స్థానిక నాయకులు కార్యకర్తలు దానిని సమర్ధించడం లేదు . బలిచ్చే మేకలకు అవకాశం ఇస్తే ఒప్పుకోము అంటూ గొడవలకు దిగారు..స్థానిక కార్పొరేటర్ సాధీక్ అనుచరులకు వంశీ అనుచరులకు మధ్య గత నాలుగు రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి..
ఇలా జనసేనకి ఇచ్చిన అన్ని స్థానాల్లో జన సైనికులు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకోవడమో, టీడీపీ వర్గాలతో సిగపట్లు పడుతుండడమో జరుగుతుండగా చూసిన జనానికి మాత్రం ఖర్చు లేని వినోదం లభిస్తుంది.