అది 2000 సంవత్సరం 24 ఏళ్ల గ్యాప్ వచ్చింది కదా ప్రజలు మీ అరాచక పాలన మరచిపోయి ఉంటారు అని ధీమా తో ఉన్నట్టు ఉన్నాడు జూలకంటి . అందుకే తమ కుటుంబం పాలించే సమయంలో మాచర్ల నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండేదని, తనకు సంబంధం లేని నీటిపారుదల ప్రాజెక్ట్ లకు కూడా తామే కారకులమని ప్రచారం చేసుకొంటూ ఉన్నాడు .
ప్రజలు ఏదైనా మర్చిపోతారు గానీ, తమ కిడ్నీ లు ఎలా మర్చిపోతారు.? 1999 లో కోడెల అండతో ఫ్యాక్షన్ నేపథ్యం వలన టీడీపీ టికెట్ దక్కించుకుని మహిళల ఓట్ల కోసం తన తల్లిని టీడీపీ అభ్యర్ధిగా నిలిపి గెలిచిన జూలకంటి హయాం రక్తసిక్తం. ఒక పక్క జూలకంటి అడ్డం వచ్చిన వారిని నరుక్కుంటూ పోతుంటే మరో పక్క కరువు కాటకాల వల్ల, ఎండిన భూములకు గుక్కెడు నీళ్లు విడుదల చేయమని అడిగితే బదులుగా బెదిరింపులు విని, పంట ఎండిపోయి తెచ్చిన అప్పులు తీర్చలేక తప్పని పరిస్థితుల్లో తమ కిడ్నీ లు అమ్మి అప్పు తీర్చిన ఘటనలు రాష్ట్రం లో మొదలైందే మాచర్ల నియోజకవర్గం లో..
అవును రాష్ట్రం లో బాబు హయాంలో 2000 సంవత్సరం నుండి 2004 వరకూ అప్పులు తీర్చడానికి రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు, దానికి తొలి సాక్ష్యం గా నిలిచింది మాచర్ల రైతులే. ఈ హృదయ విధాకర వార్త బయటకు రాగానే రాష్ట్రం అంతా చలించిపోయింది. మాచర్ల నియోజకవర్గం లోని రెంటచింతల ఆంజనేయస్వామి మాన్యం రైతులు అప్పులు తీర్చడానికి తమ కిడ్నీలు అమ్ముకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హృదయం ఉన్న మనుషులను కలచివేసింది. వారిని పరామర్శించడానికి కాంగ్రెస్ నేతలు వెళ్లగా, ఆ రైతాంగం వారి దీన గాధను వెల్లబుచ్చారు. కనీసం సొంత నియోజకవర్గం లో ఇంత జరుగుతున్నా ఏ నాడు ఆ భాదిత రైతు కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు జూలకంటి కానీ, టీడీపీ నాయకులు కానీ, ప్రభుత్వం తరుపున ఆదుకొనే ప్రయత్నం కూడా చేయలేదు.