రిషికొండ ప్యాలెస్ లో నరబలి అంటూ నీచమైన ప్రచారానికి టీడీపీ తెర తీసింది. ఇక ఇదే విషయం మీద రాత్రికి ఎల్లో మీడియా లో డిబేట్ లు పెట్టి, ఎస్ నరబలి ఇచ్చారు, నేను చూశా, ప్రత్యక్ష సాక్షులున్నారు అని తీర్పు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మొన్నటి దాకా బంగారు కమోడ్ లు అని, ఒక్కో కమోడ్ కి 25-30 లక్షలు అంటూ ప్రచారం చేసింది ఇదే ఎల్లో గ్యాంగ్. నిజానికి వెస్ట్రెన్ కమోడ్ బరువు దాదాపు 12-13 కిలోలు ఉంటుంది, ఆలెక్కన ఒక్కో కమోడ్ కి 7-8 కోట్లు ఖర్చు అవుతుంది మరి 25-30 లక్షలకి ఎలా బంగారు కమోడ్ తయారవుతుంది అని గట్టిగా అడిగేసరికి దాన్ని వదిలేసి కొత్త ప్రచారం అందుకున్నారు.. అందునా బిజెపి వాళ్లు నడ్డి మీద తన్నారు అనే బాధని డైవర్ట్ చేయడానికి కొత్తగా వదిలిన ఫేక్ ప్రచారం ఇది…
నరబలి ఇచ్చారా అనే అనుమానం ఎందుకు వచ్చింది అంటే టీడీపీ వారే క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ప్యాలెస్ లోకి ఎవరినీ అనుమతించడం లేదట, అందుకే నరబలి ఇచ్చారని అనుమానమట. ప్రభుత్వ భవనం అందునా సీఎం అధికారిక నివాసం అని వార్తలు వస్తున్నాయి . అందులోకి ఎవరినైనా అంత సామాన్యంగా ఎందుకు అనుమతిస్తారు? . Z క్యాటిగిరి సెక్యూరిటీ ఉన్న వ్యక్తి యొక్క భద్రత కోసం తన గోప్యత కోసం తన నివాసం లో అన్ని రకాల రక్షణ భాద్యతలు తీసుకుంటారు, అది సర్వసాధారణం. మరి టీడీపీ అధినేత, వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హోటల్లో రెండేళ్లు నివాసం ఉండి రాష్ట్ర ప్రజల సొమ్మును కోట్లకి కోట్లు అద్దెగా చెల్లించి, ఆ సమయంలో అత్యంత విలాసవంతమైన భవనం కట్టుకుని చేసిన గృహప్రవేశానికి సొంత కుటుంబ సభ్యులకే అనుమతి ఇవ్వలేదు. బాలకృష్ణ తప్ప మరో ఎన్టీఆర్ సంతానానికి ఆహ్వానమే లేదు.. ఆ లెక్కన చంద్రబాబు హైదరాబాద్ నివాసంలో నరబలి జరిగిందా?
నరబలులు, మూడనమ్మకాలే టీడీపీ పార్టీ పునాదులు. ఎన్టీఆర్ మూఢనమ్మకాల గురించి, కన్నెపిల్లని వివాహం చేసుకుంటే ప్రధాని యోగం ఉందని దానికోసం చేసిన రాక్షస కార్యాలు గురించి, ఇంకో సంతానం కలిగితే ప్రధాని యోగం గురించి, ఒకాయన చేతి నుండా ఉండే తాయత్తుల గురించి, ఆయన ఇల్లు కట్టినప్పుడు బీహార్ నుండి వచ్చిన ఒక కూలీ వ్యక్తి (వాచ్మెన్) మిస్సింగ్ గురించి, అతని నరబలి గురించి తెలియనిది ఎవరికి? లోకేష్ కి సీఎం యోగం కోసం దుర్గా గుడిలో క్షుద్ర పూజల గురించి తెలియనిది ఎవరికీ?
కానీ ఏ పార్టీ అలా మాట్లాడదు, ఎందుకంటే ఈ నీచ సంస్కృతి కేవలం టీడీపీ కే సొంతం. జగన్ క్రిస్టియన్ అని ప్రచారం చేసేది వారే, నరబలి అంటూ కొత్తగా ఎవరూ నమ్మని సోది పురాణం మొదలు పెట్టింది వారే..
అసలు 1996 లోనే హైదరాబాద్ ని రామోజీ రావుకు రాసిచ్చినట్లు, రుషికొండని తన వారికి 99 ఏళ్లకు లీజుకు ఇవ్వబోతే కాంగ్రెస్ నేత గీతారెడ్డి కోర్టుకు వెళ్లి ఆపకపోయుంటే ఎప్పుడో రుషికొండ బోడి గుండు అయ్యేది…
ఇవాళ జగన్ ని ఎన్ని రకాలుగా బద్నామ్ చేద్దాం అని చూసినా బూమరాంగ్ అవుతుండగా, కోపం, చిరాకు, భాద, అసూయలతో చివరికి ఈ రకమైన నీచానికి కూడా దిగజారారు.. కానీ అది కూడా బూమరాంగే అవుతుంది..