తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు చేసింది శూన్యం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం వారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. అందులో ఒకటి 200 యూనిట్ల విద్యుత్. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని జగన్ ఎన్నికలకు ముందు సంకల్పించారు. మాటిచ్చి ఊరుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేయడానికి 2019 జూలై 25న ప్రభుత్వం జీఓ నంబర్ 91 జారీ చేసింది.
తెలుగుదేశం హయాంలో హయాంలో నెలకు 50 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఉండేది. తర్వాత దానిని 100 యూనిట్లకు పెంచినా సక్రమంగా అమలు చేయలేదు. నేడు ఆ పరిస్థితుల్లేవు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు పూనుకుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివాసం ఉండే వారికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తోంది. ఇంధన శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 23 లక్షల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. కొర్రీలు పెట్టకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాన్ని వర్తింపజేశారు. ఉదాహరణకు బాబు హయాంలో 2018 – 19లో రూ.230 కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం 2021-22లో రూ.700 కోట్లు ఖర్చు మేర పెట్టారంటే ఏ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఎల్లో మీడియా అనేకసార్లు వాస్తవాలు దాచి ‘ఎస్సీ, ఎస్టీలకు షాక్’ అంటూ తప్పుడు కథనాలు రాసింది. అర్హత ఉన్న వారిలో ఒక్కరినీ తొలగించలేదని ఇంధన శాఖ స్పష్టం చేసింది. నాడు విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడిన వారికి నేడు ఆ బాధ తప్పడంతో ఆనందంగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1,83,966 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. రూ.కోట్లలో భారం పడుతున్నా ప్రభుత్వం లెక్క చేయకుండా ఉచిత విద్యుత్ను అందిస్తోంది.