పవన్ కళ్యాణ్ ప్రైవేట్ స్కూల్స్ ప్యాకేజి డబ్బుల కోసమేనా ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మరియు ఐబీ తరహా సిలబస్ వద్దు అంటూ గొడవలు చేస్తుంది. అంటే అవునని అనిపిస్తుంది జనసేనకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు . గత పది రోజులుగా దేశంలో ఎక్కడ చూసిన రాజకీయ వర్గాలలో ఎలక్టోరల్ బాండ్ల గురించి చర్చా జరుగుతుంది.
మన రాష్ట్రం కు వస్తే ఎలక్షన్ కమీషన్ గుర్తింపు కూడా లేని జన సేన పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కోట్ల రూపాయలు స్వీకరించి ఇటు రాష్ట్రం లో అటూ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. జన సేన కు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు ఎవరు ఇచ్చారు అని చూడగా శ్రీ చైతన్య స్కూల్స్ జన సేన పార్టీ కి నిధులు ఇచ్చిన విషయం బయట పడింది.
ఈ శ్రీ చైతన్య స్కూల్స్ ఇచ్చిన ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ పేదలు సామాన్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం వద్దు అని గొడవలు చేసి, తను ఎక్కడ ప్రచారానికి వెళ్లిన సందర్భం వున్న లేకపోయినా ప్రతి చోట ఇంగ్లీష్ మీడియం వద్దు దీనివలన భవిష్యత్తులో మాతృ భాషకు ఇబ్బంది అంటు సన్నాయి నొక్కులు నొక్కుతూ తనకు నిధులు అందించిన శ్రీ చైతన్య స్కూల్స్ డైరెక్షన్ లో విష ప్రచారం చేశారు..
అలాగే ఈ మధ్యనే జగన్ గారి సారథ్యం లోని రాష్ట్ర ప్రభుత్వం ఐబీ తరహా సిలబస్ ప్రవేశ పెడుతున్నాము అనగానే ఉలికి పడిన ప్రవేట్ స్కూల్స్ తమ మనిషి అయిన పవన్ కళ్యాణ్ కు నిధులు సమకుర్చగానే , పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ దీని లో స్కాం జరిగింది, పేద విద్యార్థులు చదువుకోలేరు, వారికి అవసరం లేదు అంటూ గొడవ గొడవ చేసాడు. ఇన్ని రోజులు అటూ ప్రత్యర్థి పార్టీలు ఇటు ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూంటే కొంత మంది అభిమానులు కాదు తప్పు అని చెప్పుకుంటూ వచ్చారు
ఈరోజు పవన్ కళ్యాణ్ శ్రీ చైతన్య స్కూల్స్ నుండి ప్యాకేజీ తీసుకొని పేదలకు ఇంగ్లీష్ మీడియం, ఐబీ తరహా సిలబస్ వద్దు అనీ చేసిన ప్రచారాలను చూసి వారు కూడా తమ నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయాడు అని నిర్ధారణకు వచ్చేసి తన ఐడియాలజీ మీద విరక్తి కలిగిన పరిస్థితులను చూస్తున్నాము..