2019లో ముఖ్యమంత్రి అయిన జగన్ ఆరోగ్యరంగంలో ఎవరు ఊహించని విధంగా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుగా ఉన్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలకు ఒకేసారి శంకుస్థాపన చేసి 2023-2024 విద్యా సంవత్సరంలో అయిదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. అలాగే 2024-25 విద్య సంవత్సరంనికి మరో అయిదు కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో ఏడూ కాలేజీలు 2025-26 విద్యా సంవత్సరంలో మిగిలిన ఏడు కాలేజీలను ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీలతో పాటు ప్రతి మెడికల్ కాలేజీ ఒక నర్సింగ్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వ వైద్యులని గడప గడపకు పంపి ప్రతి ఒక్కరికి పలు రకాల టెస్టులు చేపించి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ విధంగా ఇంటింటికి వెళ్లి వైద్యం చేసి ట్రాక్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. యాక్సెస్ టూ హెల్త్ కేర్ లో నూటికి నూరు శాతం అందుబాటులో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే.
ఆరోగ్య రంగంలో కూడా నైపుణ్యాభివృద్ధికి కూడా కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎన్నో ఏళ్ళుగా నైపుణ్యాభివృద్ధి అంటే ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు, డిగ్రీ చదివే విద్యార్థులకు, ఐటిఐ చేసిన విద్యార్థులకు మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ అనేది చూసాం కానీ దేశ చరిత్రలో మొదటిసారి ఆరోగ్యరంగంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అనే సంస్థతో గువి అనే సంస్థ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్హి , శిక్షణ సంస్థ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మీడియాతో తెలిపారు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఎడ్యూటెక్ కంపెనీ అయినా గువీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ టెక్నాలజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందిస్తుందని ఈ ఉచిత ఆన్లైన్ కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.