ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినరోజు నుంచే ఆయనపై టీడిపీ అనుకూల పత్రికలు దాడిని మొదలుపెట్టాయి. చంద్రబాబు పూర్తిగా పాలనలో విఫలమై దారుణ ఓటమి చూసిన తరువాత ఆయనకి గొంతుగా మారి నిత్యం ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ చెలరేగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో వీరు నేడు ఎంచుకున్న వార్త రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల గురించి.
చంద్రబాబు 5ఏళ్ల పాలనలో ఐటీ రంగం దేదీప్యమానంగా వెలిగిపోయిందని, దేశంలో ఎక్కడలేని ఐటీ అభివృద్ది చంద్రబాబు పాలనలో ఆంద్రప్రదేశ్ లో జరిగిందని . అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఐటీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని ఆ రంగంలో పరిశ్రమలు రాలేదని, పెట్టుబడుల ఆకర్షణలో పూర్తిగా వెనుకబడిందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ రంగానికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు మౌత్ పీస్ గా పనిచేస్తున్న ఈనాడు పత్రిక వార్త అచ్చు వేసి తన మార్క్ జర్నలిజంతో చెలరేగిపోయింది.
ఈ నేపధ్యంలో సదరు పత్రికలో వచ్చిన వార్త ఏంటా అని చూస్తే రాష్ట్రంలో 2019కి ముందు చంద్రబాబు పాలనలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా, ఇప్పుడవి 372కి చేరుకున్నాయి. నాలుగున్నర ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టెక్ బుల్ సాఫ్ట్వేర్ సర్వీసెస్,రాండ్ స్టాండ్ ఐటీ కంపెనీ, ఇన్-ఫోసిస్ , ఎక్స్.టీ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్స్, డబిల్యూ.ఎన్.ఎస్ లాంటి 194 ఐటీ కంపెనీలు ఏర్పాటు కావడం గమనార్హం.
ఈ కారణంతోనే ఎస్టీపీఐ గణాంకాల ప్రకారం చంద్రబాబు పాలనలో ఐటి ఎగుమతులు ఆయన దిగిపోయే సమయానికి 2018-19లో 986 కోట్లు కాగా, ఇప్పుడు జగన్ అన్న పాలనలో 2022-23లో 1,867 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఇంకా అదానీ గ్రూప్ డేటా సెంటర్, ఐటీ టవర్ ను ఏర్పాటు చేస్తుంది. రహేజా గ్రూపు కూడా భారీ ఐటీ టవర్ను కడుతోంది. ఏపీఐసీసీ ఐ స్పేస్ పేరిట ఐటీ టవర్ను నిర్మిస్తుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్రైజ్ పేరుతో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. యాక్సెంచర్, విప్రో లాంటి కంపెనీలు రావడానికి కూడా సిద్దంగా ఉన్నాయి.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబుకి మేలు చేయడం కోసం నిత్యం పక్క రాష్ట్రంలో కూర్చుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, నిత్యం అబద్దాలు ప్రచారం చేస్తూ మాకు చంద్రబాబు అధికారంలోకి రావడమే ముఖ్యం తప్ప ప్రజలతోను రాష్ట్ర ప్రతిష్టతోనూ మాకు ఎలాంటి సంభంధం లేదన్నట్టు సదరు పత్రికలు వ్యవహరించడం అత్యంత భాధాకరం. మంచి జర్నలిజం పని ఏమిటంటే సమాచారాన్ని తీసుకోవడం దానికి విలువను జోడించి ప్రజలను మేల్కొల్పడం అని అంటారు. కాని 70 ఏళ్ళు జర్నలిజం వృత్తిలో ఉన్న రామోజీరావులో ఈ లక్షణాలు లోపించాయి అనడంలో సందేహం లేదు.