దశాబ్దాల నుండి ప్రకాశం జిల్లా వాసులు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 4.38 లక్షల ఎకరాలు ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. త్రాగు నీరు 3 జిల్లాలోని ప్రకాశం, నెల్లూర్, కడప లోని 29 మండలలో ఉండే ప్రజల దాహర్తి తీర్చే ప్రాజెక్ట్ వెలిగొండ .
వెలిగొండ ప్రాజెక్టు లో ప్రధానంగా రెండు సొరంగాలు ఉన్నాయి. ఒకటి 2021, జనవరి 13కి మొదటి సొరంగం 18.8 కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. రెండో సొరంగం 18.8 కిలోమీటర్ల తవ్వకం పనులు నిన్నటికి 100 శాతం పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దమైంది వెలిగొండ ప్రాజెక్టు .
ఎప్పుడో 1996 మార్చి 5 న పార్లమెంట్ ఎన్నికల ముందు ఓటర్లని ఆకర్శించటం కోసం చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ కు మొదటి శంకుస్థాపన చేసిన నాటి నుంచి ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది అక్షరాల 10 లక్షలు, అది కూడా శంకుస్థాపన సభకు ఖర్చు చేసినదే తప్ప మరొక్క పైసా ఖర్చు చేయలేదు బాబు . ఆనాడు షుమారు 1000 కోట్ల ఖర్చు అంచనాగా ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ కి ఆ సభలో అప్పటికప్పుడు 25 కోట్లు కేటాయించిన చంద్రబాబు ఆ ఏడాది బడ్జెట్ లో 100 కోట్లు కేటాయిస్తానని శరవేగంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2004 వరకూ అధికారంలో ఉన్న బాబు ఖర్చు చేసింది సున్నా.
అలా ఆచరణకు నోచుకోని ప్రాజెక్ట్ లలో ఒకటి గా ఉండిపోయింది వెలిగొండ . 2004 లో దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞం లో మళ్లీ శంకుస్థాపన చేసి 5 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి .క్లియరెన్స్ లు అన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొని వచ్చి, ప్రాజెక్ట్ కి సంబందించిన పనులును వేగవంతం చేసింది. వైఎస్ఆర్ అకాల మరణం తో ప్రాజెక్ట్ అక్కడికి అక్కడే ఆగిపోయింది. 2014 లో అధికారం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఈ ప్రాజెక్టు సంబంధించిన పురోగతి నత్త నడకన సాగిందని చెప్పొచ్చు .
2014 నుంచి 2019 దాఖ వెలిగొండ ప్రాజెక్టు ను ఒక ఏటీఎంలా వాడుకున్నాడు చంద్రబాబు.
ప్రాజెక్ట్ కి సంభందించి ప్రధానమైన సొరంగం తవ్వకాలు పనులు ఎవరి హయాంలో లో ఎలా సాగాయి అని చూస్తే మొత్తం మూడు ఫేజ్ లు గా భావించవచ్చు, వైఎస్ఆర్ హయాంలో మొదటి ఫేజ్ (2004-2014), చంద్రబాబు హయాంలో లో రెండో ఫేజ్ (2014-2019) , జగన్ మోహన్ రెడ్డి హయాం మూడో ఫేజ్(2019 నుంచి) ,రెండు సొరంగాలు పొడవు 18.800 కిలోమీటర్లు కాగా 2004 నుంచి 2014 వరకు మొదటి సొరంగం 11.586 కిలోమీటర్ల తవ్వగా దానికి అయ్యిన వ్యయం 469.37 కోట్లు రోజుకు సగటున 5.53 మీటర్లు తవ్వారు , రెండు సొరంగం పనులు 8.747 కిలోమీటర్లు తవ్వగా దానికి అయ్యిన వ్యయం 410.30 కోట్లు రోజుకు సగటున 4.79 మీటర్లు తవ్వారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో రెండో ఫేజ్ లో మొదటి సొరంగం 4.331 కిలోమీటర్ల తవ్వగా దానికి అయ్యిన ఖర్చు 284.36 కోట్లు రోజుకు సగటున 2.41 మీటర్లు తవ్వారు , రెండో సొరంగం 2.335 కిలోమీటర్ల తవ్వగా దానికి అయ్యిన ఖర్చు 136.37 కోట్లు రోజుకు సగటున 1.31 మీటర్లు తవ్వారు. రోజుకి సగటున 5 మీటర్లు తవ్వకాలు సాగాల్సిన చోట రోజుకి ఒకటిన్నర మీటరు చొప్పున తవ్వుతూ కాలక్షేపం చేశారు మన ఘనత వహించిన బాబు గారూ .
ఇంకా మిగిలిన సొరంగం పనులు 2019 లో జగన్ అధికారంలోకి వచ్చాక మూడో ఫేజ్ లో మొదటి సొరంగం 2.883 కిలోమీటర్ల తవ్వగా దానికి అయ్యిన వ్యయం 181.47 కోట్లు రోజుకు సగటున 4.12 మీటర్లు తవ్వారు , రెండో సొరంగం 7.698 కిలోమీటర్ల తవ్వగా దానికి అయ్యిన వ్యయం 518.09 కోట్లు రోజుకు సగటున 4.30 మీటర్లు తవ్వారు . వెలిగొండ మొదటి సొరంగం పనులు 2021 , జనవరి 13న పూర్తియ్యాయి. రెండో సొరంగం పనులు నిన్నటికి ముగిశాయి, రెండో సొరంగం త్వరలో ప్రారంభం కి నోచుకోనుంది.
ఆనాడు తండ్రీ ప్రారంభించిన యజ్ఞం ఈనాడు తనయుడి చేతుల మీదుగా సాకారం కావడం జగన్ పట్టుదలకు, అంకిత భావానికి నిదర్శనం