నేను ఇచ్చిన పథకాలు తీసుకున్నారు. నేను వేయించిన రోడ్ల మీద నడుస్తున్నారు. నాకెందుకు ఓట్లు వేయరు’ ఇవి గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మాటలు. ‘మీకు మంచి జరిగిందనిపిస్తే ఆశీర్వదించండి’ ఇవి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు. ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. బహుశా జగన్లా కోరిన వ్యక్తి దేశ చరిత్రలో మరొకరు లేరేమో..
జగన్ పాలన ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లేఖలను సిద్ధం చేశారు. సంక్షేమ పథకాల వల్ల ఒక్కో ఇంటికి ఎంత లబ్ధి జరిగిందో వివరిస్తూ.. జగన్ సందేశంతో కూడిన లేఖలను రూపొందించారు. వీటిని శుక్రవారం నుంచి వలంటీర్లు మూడురోజులపాటు పంపిణీ చేయనున్నారు.
లేఖలోని సారాంశం ఇలా ఉంది. ‘ముఖ్యమంత్రిగా కాకుండా మీ కుటుంబసభ్యుల్లో ఒకడిగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఐదేళ్లలో మీ బిడ్డ సాధించిన విజయాల్లో కొన్ని గుర్తు చేయదలిచా. 99.5 శాతం హామీలను మనందరి ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. మేనిఫెస్టోకి సార్ధకత తీసుకొచ్చాం. కోవిడ్ కష్టకాలంలోనూ పథకాలు అందించగలిగాం. విద్యారంగం రూపురేఖలు మార్చేందుకు రూ.74 వేల కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు ఏనాడైనా మన బిడ్డల గురించి పట్టించుకున్నారా.. ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 3,257 రకాల చికిత్సలను చేర్చాం. పరిమితిని రూ.25 లక్షలు చేశాం. విలేజ్ క్లినిక్లు పెట్టాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. ఇంకా ఎన్నో చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. ఐదేళ్లలో రూ.1,75,007 కోట్లు అందించి అన్నదాతలకు అండగా నిలిచాం. 31 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశాం. ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసి సొంతింటి కలను సాకారం చేశాం.
సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా అమలు చేశాం. డీబీటీతో రూ.2.62 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రభుత్వం చుట్టూ తిరిగే పని లేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వాన్నే మీ గడప వద్దకు తెచ్చాం. గతంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా.. ఒక్కసారి ఆలోచించండి. ఐదేళ్లలో ఎంత మేలు చేశామో మీ కళ్ల ముందే కనిపిస్తోంది. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మరోసారి ఆశీర్వదించండి.’
నాయకులంతా మీకు చాలా వేశాం.. ఓట్లు మాకే వేయండి అంటుంటారు. కానీ జగన్ అలా కాదు. అభివృద్ధి, సంక్షేమాన్ని కళ్ల ముందు పెట్టి మేలు జరిగిందని భావిస్తే అండగా ఉండాలని కోరుతున్నారు.