సీఎం జగన్ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించనున్నారు. ఎల్లుండి అనగా శనివారం వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా జరపనున్న ఎన్నికల శంఖారావ సభ సిద్ధంలో పాల్గొనేందుకు సీఎం దెందులూరు రానున్నారు..ఇప్పటికే భీమిలిలో ఏర్పాటు చేసిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. భీమిలి సభ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో జరగనున్న రెండో సిద్ధం బహిరంగ సభ దెందులూరు లో నిర్వహిస్తున్నారు.
సిద్ధం బహిరంగ సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు. అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. కాగా ముఖ్యమంత్రి దెందులూరుకు రానున్న నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు..