2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటుకు పోటీ చేయబోవు మరో 9 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడతగా 14 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 స్థానాలలో కాంగ్రెస్ 23 స్థానాలలో పోటీ చేస్తూ ఉంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి సిపిఎం, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ పోటీ చేస్తున్నాయి.
శ్రీకాకుళం నుంచి పి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం (ఎస్సీ) నుంచి జంగా గౌతం, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, విజయవాడ నుంచి వళ్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి సుధాకర రెడ్డి, నంద్యాల నుంచి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం నుంచి మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్ షాహీన్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.