కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మనవడి వివాహానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. కర్నూల్ లోని బళ్లారి బైపాస్ లో ఉన్న ఒక కల్యాణ మండపంలో ఈ వివాహం జరగనుంది. ఉదయం 9.30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూల్ చేరుకుంటారు అక్కడ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి మధ్యాహ్నంకు తాడేపల్లికి చేరుకుంటారు. కాగా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుటుంబానికి దివంగత నేత వై యస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలకి చాల సత్సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్ ఉన్నన్ని రోజులు వైయస్సార్ వెంట నడిచిన చెన్నకేశవ రెడ్డి , రాజశేఖర్ రెడ్డి మరణాంతరం జగన్ మోహన్ రెడ్డికి తోడుగా నిలిచారు. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వైస్సార్సీపీ స్థాపించిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి వెనుక నడిచి 2012లో కాంగ్రెస్ పార్టీలో అప్పటికే ఎమ్మెల్యే గా గెలిచిన ఉన్న తన శాసన సభ్యత్వంకు రాజీనామా చేసి వైస్సార్సీపీ తరుపున పోటీ చేసి గెలిచారు.
వారి మనవడి వివాహానికి హాజరై తాడేపల్లి చేరిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకు బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సచివాలయ , వాలంటీర్ల వ్యవస్థను తీసుకొనివచ్చి . ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటిర్ ను పెట్టి ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తూ , ఒకటో తారికే పెన్షన్ దారులకు ఉదయం ఆరు గంటలకి వెళ్లి వారి ఇంటి దగ్గర ఇవ్వడం, అలాగే కోవిడ్ సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివి. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వానికి తోడ్పాటు అందించిన వాలంటీర్లుకు ప్రోత్సాహకాలు అందించి, సత్కారాలు చేయడానికి ప్రభుత్వం ఈ అభినందన సభ ను ఏర్పాటు చేసింది.