సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెలలో మరోసారి విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 13వ తేదీన ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకలకు ఆయన హాజరై ఫైనల్స్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. కాగా 21వ తేదీన చినముషిడివాడలోని శ్రీశారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకునునేందుకు వెళ్తున్నారు.
ఆరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చినముషిడివాడ చేరుకుంటారు. అమ్మవారి దర్శన అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా జగన్ పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు సీఎం జగన్ తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. సీఎం రాక సందర్భంగా హాజరయ్యే కార్యకర్తలు, ప్రజల కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు.