భారతదేశ చరిత్రలో ఇంతకముందు ఎప్పుడు జరగనటి వంటి పాఠశాల స్థాయి విద్య అభివృద్ధి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగింది. అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ పాఠశాలల రూపురేఖలను సీఎం జగన్ మార్చేశాడు. నాడు నేడు లో భాగంగా పాఠశాల భవనాలను మాత్రమే కాకుండా విద్యలో విప్లవత్కమైన పెను మార్పులు తెచ్చారు. కార్పొరేట్ విద్యాలయాలనుని తలదన్నేలా విద్య విధానాన్ని మార్చేశాడు. పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య ,CBSEసిలబస్, పిల్లలకి అర్థం అయ్యే విధంగా టెక్స్ట్ పుస్తకాలలో ఒక వైపు ఇంగ్లీష్ మరో వైపు తెలుగులో పాఠ్యoశాలు , కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా బైజూస్ ట్యాబ్ లు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐబీ సిలబస్ మరో ఎత్తు. మన దేశంలో అతి తక్కువ పాఠశాలల్లో మాత్రమే ఈ ఐబీ సిలబస్, టోఫెల్ అనేది ఉంటుంది. అది కూడా బాగా పేరు ఉన్న కార్పొరేట్ స్కూల్స్ లో ఏదాది కి ఫీజు సరాసరి 3 లక్షలు ఉంటుంది. అలాంటి ఐబీ సిలబస్ , టోఫెల్ ను ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు సీఎం జగన్ తీసుకొచ్చారు . దానికి సంబంధించిన ఎంఓయూ కూడా ఈమధ్యనే జరిగింది.
బుధవారం సచివాలయంలో ఐబీ ప్రతినిధి ఆశీష్ తో ప్రవీణ్ ప్రకాష్ సమావేశమయ్యారు. ప్రస్తుతమున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలా అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర విద్యార్థులకు బోధన సాగాలని ఉపాధ్యాయులు బోధనా విధానాలను సంస్కరించుకోవాలని సూచించారు. కాగా ఐబీ ప్రతినిధి ఆశీష్ మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న విద్యా విధానాలు ఇప్పటికే ఐబీ కరిక్యూలమ్ కు చేరువలో ఉన్నాయని, రాష్ట్రంలో ఈ విధానం అమలవుతున్న నేపథ్యంలో ఐబీ అమలు సులభంగా ఉంటుందని చెప్పారు. బోధన విధానాలు, మూల్యాంకన పద్దతులు, అభ్యసన పరికరాలు దాదాపుగా ఐబీ కరిక్యులమ్ తో సరిపోలుతున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జాతీయ విద్యా విధానంలో భాగంగా ఫౌండేషన్, ప్రాథమిక, మాధ్యమిక, ఉపాధి సంబంధిత కార్యక్రమాలు అమలు కావడం అద్భుతమన్నారు. సైన్స్, గణితం, టెక్నాలజీ తో పాటు ఇంగ్లీష్ విద్య అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని విద్యార్థులందరికీ ఉచితంగా ఉపకరణాలు అందజేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా డైరెక్టర్ పార్వతి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, ప్రొఫెసర్లు కేశవ్ రెడ్డి, గిరిబాబు యాదవ్, సుధ, మాధవీ లత తదితరులు పాల్గొన్నారు.