ఏపీ ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కలలు సీఎం జగన్ చేతుల మీదుగా ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. ప్రజలంతా ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న ప్రాజెక్టులను వరసగా పూర్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేస్తున్నారు సీఎం జగన్ . పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించడంతో పాటు ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి కృష్ణమ్మని కుప్పం గడ్డ పై పారించి అక్కడి ప్రజల కళ్ళల్లో వెలుగులు నింపిన ఘటనని కుప్పం ప్రజలతో పాటు రాయలసీమ వాసులు ఎన్నటికీ మర్చిపోరు.
ప్రకాశం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్, పూర్తి చేసుకొని నిన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఆ పై వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 4.38 లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందనుంది. అంతే కాక ఈ మూడు జిల్లాలోని 29 మండలాల్లోనూ ప్రజలకు దాహార్తి తీర్చనుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే మరో రెండు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన అర్ధవీడు మండలం పాపినేపల్లి, వెలగలపాయ ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ నిర్వహించారు . రెండు ఎత్తిపోతుల పథకాలకు 53 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రకాశం జిల్లాలోని మరో 14000 ఎకరాలకు సాగునీరు అందనుంది.