రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు సీఎం జగన్ ‘ఈద్ ముబారక్’ చెప్పారు. రంజాన్ సందర్భంగా దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు.. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక… ఆ అల్లాహ్ దీవెనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ తెలిపారు.
కాగా సీఎం జగన్ కొనసాగిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్ పడింది.. ఇప్పటికే ఉగాది పండుగ సందర్భంగా మేమంతా సిద్ధం బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రంజాన్ పండుగ నేపథ్యంలో బస్సు యాత్రకు మరోసారి బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికి 12వ రోజుల బస్సు యాత్ర ముగియగా ఈ రోజు రంజాన్ కారణంగా యాత్రకు బ్రేక్ పడడంతో శుక్రవారం రోజు 13వ రోజు యథావిథిగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగనుంది. ఈ క్రమంలో నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సీఎం జగన్ భేటీకానున్నారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు.