విశ్వమానవుడిగా పేరుగాంచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆ మహోన్నత వ్యక్తికి విజయవాడ స్వరాజ్య మైదానంలో స్మృతి వనాన్ని నిర్మించారు. విజయవాడ నగరానికే సెంట్రాఫ్ అట్రాక్షన్గా 125 అడుగుల భారీ బాబాసాహెబ్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన దీనిని సీఎం ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే సమతాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి 1.20 లక్షల మంది వస్తారని అంచనా. కాగా ఈ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహం. దేశంలోని అతిపెద్ద వాటిల్లో మూడో స్థానంలో నిలిచింది.
ఎన్నో ప్రత్యేకతలు..
స్మృతి వనం 18.81 ఎకరాల్లో ఉంటుంది. పెడస్టల్తో కలిపి 210 అడుగుల ఎల్తైన నిర్మాణం ఇది. దీని నిర్మాణం కోసం రూ.400 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఢిల్లీ నుంచి డిజైనర్లను పిలిపించింది. విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లుంటాయి. బాబాసాహెబ్ జీవిత చరిత్ర తెలిపేందుకు మినీ థియేటర్, డిజిటల్ మ్యూజియం ఉంటాయి. ఇంకా గ్రంథాయలం ఉంటుంది. జీవిత విశేషాల శిల్పాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆయనకు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇంకా ఫుడ్ కోర్టులు, కన్వెన్షన్ సెంటర్ ఉంటాయి. వనం అంతా పచ్చదనంతో నిండేలా పనులు చేశారు. విశాలమైన కారిడార్ ఉంటుంది. మెడిటేషన్ సెంటర్ కట్టారు. 85 అడుగుల పెడస్టల్ పైన 125 అడుగుల బాబాసాహెబ్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడి ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)గా దీనికి నామకరణం చేశారు. విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో ప్రభుత్వం జన్ భాగీదారి పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇవి పేరుతో ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకు ఇవి జరుగుతాయి. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలు, రాజ్యంగ నిర్మాత జీవిత విశేషాలు తెలిపే ఫొటో, బుక్ ఎగ్జిబిషన్లు, సదస్సులు నిర్వహిస్తున్నారు.
నాడు అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అంటూ మోసం చేసిన బాబు .
అంబేడ్కర్ ప్రపంచ దేశాలు గర్వించదగిన మహా మనిషి. భారత రాజ్యంగ నిర్మాత. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాజిక న్యాయం పాటిస్తూ పాలన సాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి పదవులిచ్చారు. బాబాసాహెబ్ ఆశయ సాధనకు తన వంతు కృషి చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ గొప్ప వ్యక్తి పేరు చెప్పి మోసం చేశాడు. 2015 సంవత్సరంలో అమరావతి రాజధాని ప్రకటన తర్వాత బాబు రాజధాని పరిధిలోకి వచ్చే శాఖమూరు వద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతోపాటు 20 ఎకరాల్లో స్మృతి వనం నిర్మిస్తామని ప్రకటించారు. అయితే ప్రాజెక్టు ముందుకు సాగలేదు. దీనిని బట్టి ఆయనకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాణం కోసం సమీక్షలు చేయలేదు. కమిటీలు వేయలేదు. తన పబ్లిసిటీ, ఓట్ల కోసం పేరు వాడుకుని విగ్రహ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. అయితే జగన్ అలా చేయలేదు. మాట ఇచ్చిన ప్రకారం విజయవాడలో ఎల్తైన విగ్రహాన్ని కట్టించారు. రాజ్యాంగాన్ని రాసి హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తికి జగన్ అసలు సిసలైన నివాళి అర్పించారంటూ అందరూ కొనియాడుతున్నారు.