కష్టం విలువ తెలిసిన వాడే కన్నీళ్లు తుడుస్తాడు బాధ్యతలు భారం ఎరిగిన వాడే బరువులు మోస్తాడు అని… తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే వాడే నాయకుడు అవుతాడు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్లారు కానీ బతుకులకు భరోసా ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బంది ఎదురైనప్పుడు మనకంటూ ఒక తోడు ఒక ధైర్యం ఒక నమ్మకం ఉందన్న ఆలోచన మనిషిని చాలా ప్రశాంతంగా బ్రతికిస్తుంది.. అలాంటి నమ్మకాన్ని అలాంటి ధైర్యాన్ని ప్రజలకు అందించడంలో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ నూటికి నూరు శాతం మార్కులు పొందాడు. కష్టం అని తన దృష్టికి వచ్చిన ఏ అంశాన్ని కూడా ఎంత ఖర్చైనా సరే ఏ రకమైన ఇబ్బంది అయినా సరే వెనకాడకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూసుకోవడంలో ముందు వరుసలో నిలబడ్డాడు. ప్రజల మానప్రాణాలను కాపాడడంలో జగన్ చేసినటువంటి మంచికి అనేక ఉదాహరణలు చెప్పొచ్చు.
అందులో ఒకటి మచ్చుకకి చెప్పుకుంటే కుమ్మరకొండూరుకు చెందిన 20 ఏళ్ల దర్శిగుంట జయకృష్ణ 15 ఏళ్లుగా ఎదుగుదల లేక, నడక రాక అంతుపట్టని వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు. తల్లి రాణమ్మ ఇంత వరకూ లక్షలు ఖర్చు చేసినా, ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. భర్తను కూడా పోగొట్టుకుని, కొడుకు వైద్యం కోసం ఇక ఖర్చు చేయలేని పరిస్థితిలో సహాయం చేయమని సీఎం వైఎయస్ జగన్ కు విజ్ఞప్తి చేసుకుంది. జయకృష్ణ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం ఆమెకు భరోసా కల్పించారు. జయకృష్ణ చికిత్సకు అవసరమైన సాయం అందించాలని ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ముఖ్యమంత్రి పాలన చరిత్రలో చేసిన సాయాలు కావచ్చు ప్రజలకు ఇచ్చిన ధైర్యం కావచ్చు కోకొల్లలు.. నిజానికి మనకు ఒక ధైర్యం ఉందినేను నమ్మకాన్ని కలిగించడమే నాయకత్వం.. ఆ నమ్మకాన్ని కలిగించడంలో జగన్ఎప్పుడో ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ఒక్క సహాయమునే కాదు రాష్ట్ర పాలనలోనూ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో నడిపించడంలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు నడుస్తున్నాడు. పాజిటివ్ గ్రాఫ్ సంపాదించుకున్న నాయకుడిగా జగన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.