అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి అనుగుణంగా పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మత్స్యకార భరోసా అందిస్తూనే డీజిల్ సబ్సిడీ పెంచారు. బాబు పాలనలో మత్స్యకారులకు అందిన ప్రయోజనాలు, జగన్ పాలనలో మత్స్యకారులకు చేకూరిన లబ్దిని ఓసారి పరిశీలిస్తే..
జగన్ పాలనలో రెట్టింపైన సంక్షేమం
బాబు హయాంలో మత్సకారులకు అందిన మొత్తం సాయం 104 కోట్లు కాగా జగన్ పాలనలో 1.07 లక్షల కుటుంబాలకు మత్స్యకార భరోసా ద్వారా 538 కోట్ల సాయం అందింది. ఏప్రిల్ 15 – జూన్ 14 మధ్య సముద్రంపై చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు భృతిగా చంద్ర బాబు పాలనలో 4 వేలు అందిస్తే సీఎం జగన్ ఆ మొత్తాన్ని10 వేలకు పెంచి అందిస్తున్నారు. మత్స్యకారులకు లీటరు డీజిల్ కు బాబు పాలనలో రూ. 6 అందిస్తే ఆ మొత్తాన్ని రూ. 9 చేసి సీఎం జగన్ అందిస్తున్నారు. మత్స్యకారులు దురదృష్టవశాత్తూ మరణిస్తే చెల్లించే ఎక్స్గ్రేషియా బాబు పాలనలో 5 లక్షలు కాగా జగన్ పాలనలో 10 లక్షలకు చేరింది.
సీఎం జగన్ చొరవతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపు లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు ఇప్పటివరకు 5 విడతల్లో రూ.647 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అంతేకాకుండా మన తీరం మత్సహారం అనే విధంగా 20 వేల కోట్లతో 4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు ,6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పోర్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
మత్స్యకారులకు పదవులిచ్చి వారిని అందలం ఎక్కించిన ఘనత సీఎం జగన్ కే దక్కింది. 4 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ ఎంపీ, 3 ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు ఇచ్చి మత్స్య కారులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. జగన్ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటు దక్క లేదు. కానీ మత్స్యకారులకు తొలిసారిగా మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు.