నేడు జగనన్న విద్యాదీవెన కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజ్ రీ ఎంబర్స్ మొత్తం జమ చేసిన ముఖ్యమంత్రి జగన్ తర్వాత సభలో మాట్లాడుతూ “ఈ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, రామోజీ రావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లందరితో పాటు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు
గవర్నమెంట్ బడులు మారాలని, ఇంగ్లీషు మీడియం తేవాలని ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది. మనపై యుద్ధం చేస్తున్న వీళ్లు, వీళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు కూడా ఏ మీడియంలో చదువుతున్నారని మీలో ఎవరైనా నిలదీస్తే మాత్రం ఏఒక్కరూ తెలుగుమీడియంలో చదువుతున్నారని చెప్పరు.వాళ్ల పిల్లలేమో ఇంగ్లీషుమీడియం చదవాలి, కానీ మన పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవాడానికి మీ జగన్ అడుగులు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించి పోతుందని ఏకంగా యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారన్నారు .
పెత్తందార్లయిన వారికో ధర్మమట. పేదలైన మీకో ధర్మమట. వారి పిల్లలకు ఓ బడి అంట. మన పిల్లలకు ఇంకో బడట. వారి చదువులు వేరట, మన చదువులు వేరట. పెత్తందార్లుగా వారుండాలట. పనివారిగా మనం ఉండాలట. పరిశ్రమలు వారివట. కార్మికులుగా మాత్రమే మనమట. సామ్రాజ్యాలన్నీ వారివట. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట, ఇదేం న్యాయమో ఆలోచించమన్నారు.
వారి పిల్లల చేతుల్లో ట్యాబులుండొచ్చు. స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. కానీ మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులిస్తే మాత్రం పిల్లలు ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారని యాగీ చేస్తారు.ఇవన్నీ ఎప్పటికీ మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయన్నారు.
విద్యారంగంలోనూ క్లాస్ వార్
ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి, మనకు మధ్య క్లాస్ వార్ జరుగుతోంది. ఇది పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం, డబ్బులున్న వారికి, డబ్బుల్లేని వారికి చదువుల కోసం జరుగుతున్న యుద్ధం. ఈ క్లాస్ వార్లో బాబు మనుషుల దుర్మార్గపు భావజాలం మీద పోరాడుతూ మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.
ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే, ఈ విప్లవానికి అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులు సైతం ఆన్ లైన్ లో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం వరకు ప్రతి ఒక్కటీ విప్లవాత్మక మార్పు. ఇవన్నీ ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడయం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టామన్నారు.
ఇలాంటి ఉన్నత సంస్కరణల కోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ లో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే ప్రభుత్వ బడులలో సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. ఏకంగా 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ఈ 57 నెలల కాలంలోనే.
మొట్ట మొదటి సారిగా గవర్నమెంట్ బడుల్లో బైలింగువల్ టెక్ట్స్బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగుతో మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నది కూడా ఈ 57 నెలల కాలంలోనే అని చెప్పుకొచ్చారు.
ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ ను పేద పిల్లలు చదువుతున్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే పిల్లల చేతుల్లో ఏకంగా ప్రభుత్వం ట్యాబులు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే అన్నారు.
మొట్ట మొదటిసారిగా నాడునేడుతో స్కూళ్లన్నీ రూపురేఖలు మారుస్తూ, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్ పీ ప్యానెల్స్ తీసుకొస్తూ అడుగులు పడింది, పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తున్నది, నాడునేడులో భాగంగా 45 వేల స్కూళ్లలో రూపురేఖలు మారుస్తూ 12 రకాల అంశాలను తీసుకొని ప్రతి స్కూళ్లో తీసుకొస్తూ అడుగులు పడింది, పిల్లలకు రోజుకో మెనూతో గోరుముద్ద అందిస్తున్నది,. ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలుండాలని, అందులో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒకటిఉండాలని ఏర్పాట్లు చేస్తున్నది అన్ని కూడా ఈ 57 నెలల కాలంలోనే అంటూ తమ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులను గురించి తెలియజేసారు.
ఐక్య రాజ్యసమితిలో మన పేద ఆడ పిల్లలు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడిన ఘట్టం పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతోందో ప్రపంచానికి చాటి చెప్పిందో చూశాం. పెద్ద చదువులే చదువుతున్న పిల్లలకు మొట్ట మొదటి సారిగా 100 శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి . భోజన, వసతి ఖర్చులు కూడా భరిస్తున్న ప్రభుత్వం కూడా ఈ 57 నెలల కాలంలోనే అన్నారు
ప్రపంచ స్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్ లో 330 కాలేజీల్లో సీటు మీరు తెచ్చుకోండి రూ.1.25 కోట్ల వరకు ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు.
చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొదటిసారి ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు, కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావాలి, భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకురావాలన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని దేవుని దయతో మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తానని తెలియజేసారు సీఎం జగన్