‘వచ్చే ఎన్నికల్లో గెలిచాక వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా’ విశాఖపట్నంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రేమ ఉందో తెలియజెప్పేందుకు ఈ ఒక్క మాట చాలు. మంగళవారం సీఎం వైజాగ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచే పాలన సాగిస్తా. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని జగన్ అభిప్రాయపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు విషం కక్కుతున్నారని ఫైరయ్యారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించారు. అక్కడ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళవారం కూడా జీవీఎంసీ వీఎంఆర్డీఏకి చెందిన రూ.1,500 కోట్ల పనుల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పాలనకు సంబంధించి ఇప్పటికే భవనాలు సిద్ధం చేశారు.
వైఎస్సార్సీపీ నాయకులు వైజాగ్ను నాశనం చేస్తున్నారని, దాని అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎల్లో గ్యాంగ్ చాలాకాలంగా ప్రచారం చేస్తోంది. అయితే జగన్ ఇక్కడే ప్రమాణ స్వీకరాం చేస్తా.. పాలన సాగిస్తానని చెప్పి వారి నోళ్లు మూయించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా విశాఖే ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధాని అని స్పష్టం చేశారు.