ఆంధ్రప్రదేశ్లో పిల్లల చదువుల కోసం ఏమి చేయాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చాలు బాగా తెలుసు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కాలేజీ విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు తెచ్చి అండగా నిలిచారు. దాని ఫలితాలను ప్రస్తుతం అందరూ చూస్తున్నారు. ఇటీవల సర్కారు బడుల్లో ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మహా నగరాలకే పరిమితమైన ఈ ప్రోగ్రాం పేద పిల్లలకు అందేలా అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి జగనన్న శ్రీకారం చుట్టారు. అదే ఎడెక్స్ ప్రోగ్రాం.
ఇందులో భాగంగా మన పిల్లలకు ప్రపంచ వర్సిటీ అధ్యాపకుల బోధన చేయనున్నారు. సుమారు 2 వేలకు పైగా వరల్డ్క్లాస్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి వస్తాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వర్సిటీల సర్టిఫికేషన్లు తీసుకోవచ్చు. 12 లక్షల మందికి మేలు జరుగుతుందని అంచనా.
ఏంటీ ఈ కోర్సు
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎడెక్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతోపాటు ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఎడెక్స్, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు. దీంతో మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలతోపాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు.
చదువుకోవాలని ఆశ ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది పిల్లలు ఉన్నత విద్యకు దూరమవుతుంటారు. చిన్నపాటి ఉద్యోగాలతో సరిపెట్టుకుంటారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు అనేక చర్యలు తీసుకుంది. అందులో ఒకటి ఈ ఎడెక్స్. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సులు చదువుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయితే ఉచితంగా ఆన్లైన్లో చదుకోవచ్చు. పైగా భవిష్యత్కు భరోసా సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందాలంటే ప్రత్యేక స్కిల్స్ ఎంతో అవసరం. వాటినే జగన్ మామ పిల్లలకు అందించాలని తపన పడుతున్నారు. భావితరాలకు ఆయన ఇస్తున్న ఆస్తి చదువు. ఈ సంస్కరణ ఫలితాలు ముందుముందు దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.