ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించి ముఖ్య నేతలతో చర్చించనున్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం మేర నెరవేర్చిన ఘనత జగన్కు దక్కుతుంది. నవరత్నాలతో పేదలకు అండగా నిలిచారు. కొన్ని పథకాలు ఎన్నికల హామీల్లో లేకపోయినా అమలు చేసి చూపించారు. అదే విధంగా మరోసారి కూడా అమలుకి సాధ్యమయ్యే మేనిఫెస్టో రూపొందించే దిశగా వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సంక్షేమం లాంటి అంశాల పై సుదీర్ఘ కసరత్తు తర్వాత జరుగుతున్నా నేటి సమావేశంలో మేనిఫెస్టోకి తుది రూపు రావొచ్చని ప్రాథమిక సమాచారం .
మరో వైపు 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన 650కి పైగా హామీలను అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. మేనిఫెస్టోలో ఇద్దరి నేతల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. జగన్ దానిని అందరికీ కనిపించేలా సచివాలయంలో డిస్ప్లే చేయిస్తే.. బాబు టీడీపీ వెబ్సైట్ నుంచి డిలీట్ చేయించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. ఆ ఫలితంగా 2019 లో దారుణంగా పొందిన ఓటమి నుండి బాబు గుణపాఠం నేర్చుకొన్నట్టు లేదు. మళ్ళీ మిని మేనిఫెస్టో, సూపర్ సిక్స్ అంటూ అలివిగాని హామీలకు తెర తీశారు. ఒక్క మిని మేనిఫెస్టో హామీలకే ఏడాదికి లక్షా ఇరవై వేల కోట్లు అయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి మేనిఫెస్టో వస్తే ఏడాదికి ఎన్ని లక్షల కోట్ల హామీలు ఇస్తాడో అవి అమలు చేసేవి కావని ప్రజలు ఛీ కొడతారో అని టీడీపీ సీనియర్లు భయపడుతున్న నేపథ్యంలో టీడీపీ ఇవ్వబోయే మేనిఫెస్టో ముందే ఆసక్తి కోల్పోయిందని చెప్పొచ్చు.
మరో వైపు జగన్ ప్రభుత్వం ప్రకటించబోయే మేనిఫెస్టో పై అన్ని వర్గాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశామని, వాటిని చూపించి ఓట్లు అడగాలని ఇప్పటికే మూడు సిద్ధం సభల్లో జగన్ తన నాయకులు, కార్యకర్తలను కోరారు. నవరత్నాలతో ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించిన వైఎస్సార్సీపీ ఈసారి ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకొస్తుందని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దీనికి కారణం జగన్ ఇచ్చిన మాటపై నిలబడతారనే నమ్మకం.