అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి అమర్ నాథ్ తో పాటు పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..
వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇవ్వడానికి మన అనకాపల్లికి సీఎం జగన్ గారు విచ్చేశారు. ఇదే కాదు రాష్ట్రంలో పేదవాడికి పెద్ద ఎత్తున సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఒక నాయకుడు పేద అక్కచెల్లెమ్మలకు రూ. 2,77,000 కోట్లకు పైగా సంక్షేమాన్ని అందించిన నాయకుడు, ప్రపంచంలో ఇంత సంక్షేమం ఇచ్చిన నాయకుడు ఎవరూ ఉండి ఉండరు. సీఎంగారు ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సమయంలో ప్రజలకు ఒక మాట ఇచ్చారు. అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి జిల్లా హెడ్క్వార్టర్ చేస్తాన్నారు. మాట నిలబెట్టుకున్నారు. ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం రూ. 1,500 కోట్లు ఖర్చుపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్ గారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా వస్తున్నారు. జగన్ గారిని ఎదుర్కోవాలంటే ఎదురుగా జగనే ఉండాలి. జగన్ ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రాత్మక అవసరం. నేను ఇదే వేదిక నుంచి చెప్తున్నానాకు సీఎంగారు ఉమ్మడి విశాఖ జిల్లాకు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. నేను రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం సీఎం గారి కోసం పనిచేస్తా. సీఎంగారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అందరి తలరాతలు భగవంతుడు రాస్తాడు. అమర్నాథ్ తలరాత జగన్ గారు రాస్తారు.
జగనన్న పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలలో నేను 6 రత్నాలు పొందాను. నాకు వైఎస్సార్ చేయూత అందింది. ఆ డబ్బుతో స్త్రీనిధి లోన్ తీసుకుని జీడితోట కౌలు తీసుకున్నాను. రెండో విడత డబ్బుతో పాడిగేదెలు కొనుక్కున్నాను. మూడో విడత డబ్బుతో రేకుల షెడ్డు నిర్మించుకున్నాను. నాకు వైఎస్ఆర్ ఆసరా కూడా వచ్చింది. ఈ నాలుగేళ్ళలో చాలా లబ్ధిపొందాను. నా కోడలికి హౌసింగ్లో ఇళ్ళు మంజూరు అయింది. నేను అభివృద్ది చెంది 4 సెంట్ల భూమి కొనుక్కున్నాను. నేను చీపురుపుల్లలు కోసుకునే పేద మహిళను. నాకే కాదు ఇంటింటికి మీరు అనేక పథకాలు ఇచ్చారు. మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలి. నా కాలు విరిగితే ఆరోగ్యశ్రీలో చికిత్స పొందాను. అన్నా కూడులేని మాకు కూడు పెట్టావు. నీడలేని మాకు నీడనిచ్చావు. మనమంతా జగనన్న చేసిన సాయం మరిచిపోకుండా అన్నను గెలిపించుకుందాం.
మాకు వైఎస్సార్ చేయూత ద్వారా మాకు సాయం చేస్తున్నారు. పాదయాత్రలో చెప్పినట్లు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాకు మొదటి విడత వచ్చిన సొమ్ముకు తోడుగా మరికొంత జమ చేసి ఆవును కొనుక్కున్నాను. నెలకు రూ. 10 వేల ఆదాయం సంపాదించుకుంటున్నాను. రెండోవిడత డబ్బుతో ఇంకో ఆవును కొనుక్కుని నెలకు రూ. 20 వేలు సంపాదిస్తున్నాను. నాకు వైఎస్సార్ ఆసరా కింద నా వాటాగా రూ. 62 వేలు వచ్చాయి.కుట్టుమిషన్ కొనుక్కుని మరింత ఆదాయం పొందుతున్నాను. సేంద్రీయ ఎరువు తయారు చేసుకుని కూరగాయలు పండించుకుంటూ ఎకరా వరి సాగు చేస్తున్నాను. ఏడాదికి రూ. లక్ష ఆదాయం వచ్చింది. ఇంతవరకు నేనెప్పుడూ అంత ఆదాయం చూడలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మూడో విడత డబ్బుతో ఆవుల షెడ్ వేయించుకున్నాను. ఈ డబ్బుతో గడ్డి మిషన్ కొందామని అనుకుంటున్నాను. వ్యవసాయానికి పెట్టుబడి మీరే ఇస్తున్నారు. నాకు రైతుభరోసా అందింది. మేం దర్జాగా బతుకుతున్నాం. మొత్తం నాకు రూ. 1,90,000 వచ్చాయి. దాన్ని రెట్టింపు చేసి వ్యవసాయం వృద్ది చేస్తాను. మా అమ్మకు ముగ్గురం కూతుర్లం, మీరు పెద్దకొడుకులా ఫించన్ ఇస్తున్నారు. మా కుటుంబానికి అవసరమైన ప్రతిదీ ఇస్తున్నారు. మీ చల్లని చూపులే మాకు శ్రీరామ రక్ష.