సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పింది చేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేయరు. ప్రజా సంకల్ప యాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన దాదాపుగా నెరవేర్చారు. పాదయాత్ర సమయంలో వివిధ వాహనాల డ్రైవర్లు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. చలించిపోయిన ఆయన అధికారంలోకి రాగానే అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాటను ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా నిలబెట్టుకున్నారు జగన్. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న డ్రైవర్లకు సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాహనమిత్ర పథకాన్ని 2019 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించారు. 2,36,344 మందికి సాయం చేశారు. తర్వాత రెండో ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. 2,62,493కి చేరింది. కరోనా కారణంగా డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం నాలుగు నెలల ముందే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ.262.49 కోట్లు జమ చేశారు. ఐదో విడత ఆర్థిక సాయాన్ని గతేడాది సెప్టెంబర్లో జగన్ విడుదల చేశారు.
లబ్ధిదారుల్లో ఎక్కువ శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఈ డబ్బుతో వాహనానికి బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, చిన్నపాటి మరమ్మతులకు ఇబ్బందులు లేకుండా పోయాయని ఆటో, ట్యాక్సీ వాలాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వాహన మిత్ర పథకాన్ని రాష్ట్రంలో పారదర్శకంగా అమలు చేశారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి పథకాలు లేవు. ఉన్న ఒకటీ అరా పొందాంటే టీడీపీ నాయకులతో ఏర్పడిన జన్మభూమి కమిటీలు సిఫార్సు చేయాల్సిందే. కానీ జగన్ సర్కార్ ఏ నాయకుడి సిఫార్సు లేకుండానే అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తోంది. వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకున్నాక వాటిని గ్రామ లేదా వార్డు వలంటీర్ తొలుత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చివరగా రవాణా శాఖ అధికారులు… ఇలా ఆరు దశల్లో పరిశీలించిన మీదట అర్హులను ఎంపిక చేశారు.
మొత్తంగా ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.50 వేలు చొప్పున అందుకున్న లబ్ధిదారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆటోకు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేదని మోటారు వాహనాల తనిఖీ అధికారులు జరిమానాలు విధించేవారు. దీంతో వాహనాలు అమ్మేసి వేరే వృత్తులకు వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. జగన్ ప్రభుత్వం వాహన మిత్ర ద్వారా సాయం చేయడంతో అన్ని ధ్రువీకరణపత్రాలు తీసుకోగలిగారు. అంతేకాకుండా ఆయా డ్రైవర్ల కుటుంబాలకు ఇతర సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి. ఒక్కొక్కరు రూ.లక్షల్లో లబ్ధి పొందారు. తమ సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, ఆయనకే తమ మద్దతు ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.