ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్నెట్ వినియోగదారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ తో పోలిస్తే చంద్రబాబు వెనుకబడ్డారని గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయ. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇప్పటికే ఆయన నిర్వహించిన సిద్ధం సభలు సక్సెస్ కావడంతో మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో సీఎం జగన్ గురించి ఇంటర్నెట్ లో వెతికేవారి సంఖ్య క్రమంగా పెరిగింది. సీఎం జగన్ రూపొందించిన సంక్షేమ పథకాల గురించి, ఆయన పాలన గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి.
ఇదే సమయంలో చంద్రబాబు గురించి ఇంటర్నెట్ లో వెతికేవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు గూగుల్ ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. సీఎం జగన్ కోసం వెతికేవారి సంఖ్య పెరగడంతో పాటు ఆయన పాలన మరియు కార్యక్రమాల పట్ల ప్రజల ఆసక్తి చూపేవారి సంఖ్య పెరగడం ఇప్పుడు కీలకంగా మారింది. ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వెల్లువలా వస్తున్న జన ప్రభంజనాన్ని చూస్తుంటే మళ్ళీ ఏపీ సీఎంగా జగన్ ఎన్నికయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.