2019 సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజారిటీ సాధించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి విద్యకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చాడు. భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే అతి పెద్ద బహుమతి ఏదైనా ఉంది అంటే విద్య మీద పెట్టుబడే అని జగన్ అన్నట్లుగానే విద్యకు సంబంధించి అనేక మార్పులు తీసుకొని వచ్చాడు. ఈ అయిదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం దాదాపు 73000 కోట్ల రూపాయలు విద్యాభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసింది.
అమ్మ ఒడి ద్వారా తమ బిడ్డల్ని బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో ప్రోత్సహం క్రింద 44,48,865 మంది లబ్దిదారులకు 26,607 కోట్ల రూపాయలను అందించింది జగన్ ప్రభుత్వం
జగనన్న విద్య కానుక ద్వారా 3,366కోట్ల రూపాయలతో 47,40,421 మంది విద్యార్థులకు జగన్ ప్రభుత్వమే బడికి వెళ్లే ప్రతి విద్యార్ధికి బట్టలు, పుస్తకాలు, బ్యాగ్ ,షూ ఇచ్చింది .
నాడు నేడు పథకం ద్వారా పాఠశాల రూపు రేఖలను మార్చేసింది , కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించింది. నాడు నేడు లో భాగంగా ప్రతి తరగతి గదిలో టైల్స్, బెంచులు, ఫ్యాన్లు, అధునాతన క్లాస్ రూమ్స్ ని సిద్ధం చేసింది, నాడు నేడులో భాగంగా 38,059 పాఠశాలలకు అక్షరలా 11,669 కోట్లను ఖర్చు చేసింది ప్రభుత్వం.
వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం క్రింద 35,70,675 మంది లబ్దిదారులకి 6,688 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలు ద్వారా గర్భిణీలు, బాలింతులు, చిన్న పిల్లలకు పౌష్ఠిక ఆహారం అందిస్తారు.
స్వేచ్ఛ శానిటరీ నాప్కిన్స్ 10,01,860 మంది ఆడ పిల్లలకు 32 కోట్లతో శానిటరీ నాప్కిన్స్ ను అందిస్తోంది ప్రభుత్వం.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో అద్భుతమైన సంస్కరణ బైజూస్ కంటెంట్ ద్వారా పాఠాలు చెప్పడం. బైజూస్ కంటెంట్లో వివరణాత్మకతో కూడిన పాఠ్యంశాలను బోధిస్తారు, అవి చూడడం ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా అర్థం అవుతుంది. ఈ బైజూస్ ట్యాబ్ ను 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులుకు ఇస్తారు. ఈ టాబ్ ల కోసం ఇప్పటివరకు 9,52,904 మంది విద్యార్థులకు 1306 కోట్ల ఖర్చు చేసారు.
పాఠశాల స్థాయిలో ఇంకో సంస్కరణ ఇంటరాక్టీవ్ ప్యానల్స్ ద్వారా బోధనా , ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పైన బోధనా, 1 నుంచి 5వ తరగతి వరకు టీవీ ప్యానల్స్ పైన బోధనా . దీని ద్వారా పిల్లలకు ఇంకా చాల బాగా అర్థం అవుతుంది. 62,000 ఇంటరాక్టివ్ ప్యానెల్స్ కు , 45000 వేల టీవీ ప్యానల్స్ కు ఖర్చు చేసిన మొత్తం 838 కోట్లు.
జగనన్న విద్య దీవెన ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు జగన్ ప్రభుత్వమే అందిస్తుందో. గతంలో ప్రభుత్వాలు ఏడాది 35000 మాత్రమే ఇచ్చేవి. లక్ష ఫీజు ఉన్న కాలేజీలో మిగిలిన ఫీజును 65000 తల్లితండ్రులే కట్టాల్సిన పరిస్థితి. కానీ జగన్ ప్రభుత్వం ఫీజు మొత్తం భరిస్తోంది . ఈ పథకం ద్వారా 29,65,310 మంది విద్యార్థులకి 12,610 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.
జగనన్న వసతి దీవెన ద్వారా భోజనాలు, వసతి కోసం 25,12, 245 మంది విద్యార్థులకు 5,392 కోట్ల రూపాయలను అందించింది ప్రభుత్వం. ప్రతి ఏడాది విద్యార్ధికి 20000 అందించింది ప్రభుత్వం.
జగనన్న విదేశీ విద్య పథకం ద్వారా విదేశాలలో చదువుకొనే 408 విద్యార్థులు కోసం 107 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. సివిల్స్ రంగంలో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి 1 లక్ష, మెయిన్స్ క్లియర్ చేసిన వారికీ 50000 ప్రోత్సహకం అందించింది ప్రభుత్వం.