వందేళ్ళ భారతదేశ రాజకీయ చరిత్రలో మునిపెన్నడూ లేని కొత్త అధ్యాయానికి తెర తీశాడు వైయస్ జగన్. ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలవద్దకు వచ్చిన జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను కల్లారా చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను గత ఎన్నికలలో ప్రకటించాడు. మేనిఫెస్టోని ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ గా భావిస్తానని చెప్పినట్టుగానే ఇచ్చిన హామీలులో నూటికి 90 శాతం హామీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందాడు. ఐదేళ్ల పాలన తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఆ పాలన మీకు నచ్చితేనే ఈ ప్రభుత్వంలో మీకు మేలు జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన మాట వందేళ్ళ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా ఏ నాయకుడు చెప్పలేదు అంటే అతిశయోక్తి కాదు.
ఇప్పటివరకు దేశ రాజకీయాలలో అనేకమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. కానీ ఏ రోజు మేము చేసిన మంచి చూసి మాకు వెయ్యండి అనే అడిగే ధైర్యం చేయలేకపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలపు రాజకీయ నేతను అని చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ అనుభవంలో ఎప్పటిదాకా ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా నా పాలన నచ్చితేనే నాకు ఓటేయండి అని అడిగే ధైర్యం చేయలేకపోయాడు అంటే… తన పాలన మీద తనకు ఏమాత్రం నమ్మకం ఉందో ప్రజలు ఎంతవరకు నమ్మగలుగుతున్నారనే విషయం తేటతెల్లమవుతుంది. నయానో, భయానో, తృణమో పణమో ఇచ్చి, కుల భావన, ప్రాంతీయ భావన, మత విద్వేషాలు వగైరా వగైరాలు ఉపయోగించి ఓట్లు అడిగిన సందర్భాలే చూసాము తప్పితే ఏ రోజు నా పాలన నచ్చితే నాకు ఓటేయండి అనే మాట చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వినలేదు.
కానీ, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఒక 40 ఏళ్ళ యువకుడు అధికారం చేపట్టి, ఐదేళ్లలో ప్రజలకు తాను చేసిన మంచిని చెప్పుకొని నేను చేసిన మంచి మీకు చేరితే నాకు ఓటు వేయండి, నా ప్రభుత్వం మన ప్రభుత్వం మీకు మేలు చేసింది అని నమ్మితేనే నాకు ఓటేయండి అని గర్వంగా ఓటు అడిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మునిపెన్నడూ లేనివిధంగా దేశంలోనే మొట్టమొదటిసారి మంత్రిగా ఐదేళ్ల పాలన తర్వాత తన పాలను చూసి ఓటు వేయమని అడిగే ధైర్యం చేసిన ఏకైక నాయకుడు జగన్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇది దేశ రాజకీయాలలో ఇది అత్యున్నతమైన మార్పు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…