సాధారణంగా రాజకీయ పార్టీలు చదువు లేని వారికి టికెట్లు అధికంగా ఇస్తుంటాయి. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పరిస్థితికి చెక్ పెట్టారు. మెజార్టీ శాతం సీట్లను బాగా చదువుకుని సమాజంతో అవగాహన ఉన్నవారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పిస్తున్నారు. శనివారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాను ఒకసారి చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
– అసెంబ్లీ, పార్లమెంట్కు కలిపి 153 మంది (131 ఎమ్మెల్యే, 22 ఎంపీ) గ్రాడ్యుయేట్లు. 58 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఆరుగురికి డాక్టరేట్ కూడా ఉంది.
– మొత్తంగా అభ్యర్థుల్లో 17 మంది డాక్టర్లు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్స్, ఒకరు జర్నలిస్ట్, మరొకరు డిఫెన్స్ వ్యక్తి ఉన్నారు.
– ఎమ్మెల్యేలకు సంబంధించి 131 మంది డిగ్రీ, అంతకు పైన చదివారు. 47 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. నలుగురికి డాక్టరేట్ ఉంది. వీరిలో 13 మంది వైద్యులు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, ఒకరు జర్నలిస్ట్, మరొకరు డిఫెన్స్ వ్యక్తి ఉన్నారు.
–14 సీట్లను స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, కార్యకర్తలుగా ఉన్న వారికి కేటాయించారు.
– పార్లమెంట్కు సంబంధించి 22 మంది డిగ్రీ, అంతకు పైన చదివారు. 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. నలుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు, ఒకర చార్టెట్ అకౌంటెంట్, ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు.
అభ్యర్థులు చదువుకున్న వారైతే ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుంది. అధికారులతో బాగా మాట్లాడుతారు. పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామని జగన్ వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.