జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంస్కరణల బాటలో దూసుకుని పోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఏ పాలకుని హయాంలో జరగనటువంటి సంస్కరణలు ఒక్క జగన్ పాలనలోనే జరిగాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తమ ప్రజలకి ఏపీ మోడల్ సంస్కరణలను అందించాలనే సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృంధం ఇప్పటికే ఏపీకి వచ్చి ఇక్కడ అమలులో ఉన్న అనేక నూతన పరిపాలన విధనాలని పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో అమలకు కసరత్తు ప్రారంభించారు.
ఏపీలో జగన్ పాలన 5ఏళ్లలో జరిగిన సంస్కరణలు చూస్తే, దేశంలోనే తొలిసారిగా 2.66 లక్షల వాలంటీర్లను నియమించి పాలన సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించారు. అలాగే 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఊరిలో సగటున రెండు వేల జనాభాకు 10 ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి, పాలనను వికేంద్రీకరించి నూతన చరిత్రకు బాటలు వేశారు. ఇక నాడు-నేడుతో ప్రభుత్వ విద్యావ్యవస్థలో నవశకం లిఖించి, 38 వేలకు పైగా పాఠశాలలను ఆధునికీకరించి, పేద పిల్లలకు ఇంగ్లీషు చదువులు అందించి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐబీ సిలబస్ ను వారికి చేరువ చేసి, డిజిటల్ విద్యకు బాటలు పరచి, కార్పొరేట్లకు ధీటుగా పేద విద్యార్థులకు యూనిఫాం మొదలు పుస్తకాల వరకు విద్యాకానుక ద్వారా అందించారు.
ప్రభుత్వ ఆసుప్రతులను, మెడికల్ కాలేజీలను తీర్చిదిద్ది ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమంతో ఇంటింటికీ వైద్యాన్ని చేరువ చేసిన ఘనత జగన్ గారికే దక్కుతుంది. దేశానికే దిక్సూచిగా అయిదేళ్ల కాలంలో అవినీతికి ఆస్కారం లేకుండా 2.74 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలను పేదల ఖాతాల్లో నేరుగా జమ చేసిన చరిత్ర ఒక రికార్డ్. అలాగే దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 66.34 లక్షలకుపైగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఒకటో తేదీనే తలుపు తట్టి, వాలంటీర్ల ద్వారా పింఛన్ అందించి వారికి తోడుగా నిలవడం ఆయనలోని మానవతా కోణాన్ని బయటపెట్టింది. ఇక కేబినెట్ లోనూ, పార్టీ పదవుల్లోనూ, అసెంబ్లీ పార్లమెంటు సీట్లలోనూ సగానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించి, సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించారు జగన్.
కోటి మందికిపైగా మహిళలకు ఆసరాగా, చేయూతగా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంగా మారి, అమ్మ ఒడి ఇచ్చి వారి వికాస అధ్యాయానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో ఇచ్చి, వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టుకోవడానికి తోడ్పాటు అందించి వారి సొంతింటి కల నెరవేర్చి మానవీయ మూర్తిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్య్రానంతరం మరెవరూ చేయలేని స్థాయిలో ఏకంగా 4 ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తూ ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా మారారు. అలాగే స్వాతంత్య్రం వచ్చాక ఏడున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేశారు జగన్. ఒకరి 5ఏళ్ల పాలనలో ఇన్ని సంస్కరణలు రూపుదిద్దుకోవడం బహుశా దేశ చరిత్రలోనే తొలిసారి కావచ్చు