ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. మొన్నటి వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అనేక మంది చేరారు. ప్రస్తుతం నియోజకవర్గాల్లో జరుగుతున్న బహిరంగ సభల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా సోమవారం చోడవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో విశాఖ డీసీసీ ప్రెసిడెంట్ గొంపా గోవిందరాజు, విశాఖ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జీవీవీఎస్ కమలాకరరావు, పెందుర్తికి చెందిన ఎన్.ప్రసాదరావు (జేసీబీ ప్రసాద్), శ్రీనివాసరావు, వెంకట్రావు, తదితరులు పార్టీలో చేరగా జగన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీసీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరామని ఈ సంరద్భంగా వారు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తామని, జగన్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తమవంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.