అరచేతిలో స్వర్గం చూపుతూ ప్రజలని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు మహా సమర్ధుడని జాతీయ స్థాయిలో పేరుంది. ప్రతిపక్షంలో ఉండగా మీకోసం అంటూ నేల పై తిరిగి రైతులు, మహిళలు, యువతకి అనేక హామీలిచ్చి, అధికారం ఛేజిక్కగానే ఆకాశంలో విహరిస్తూ జపాన్, సింగపూర్, జర్మనీ అంటూ పిట్టలదొర కబుర్లు చెప్పడం ఆయనకే సాధ్యం .
చంద్రబాబుకు పట్టిన ఈ విదేశీ పిచ్చి ఈనాటిది కాదు
1995 లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన బాబు ఆ తరువాత ప్రజలకి బయోస్కోపులో వైకుంఠం చూపడం మొదలుపెట్టాడు. 1996 లో పార్లమెంట్ ఎన్నికల వేల ఏప్రిల్ 8న విశాఖ జిల్లా నక్కపల్లి కళాశాల గ్రౌండ్స్ లో భారి బహిరంగ సభ పెట్టి తెలుగుదేశానికి 20ఏళ్ళు అధికారం ఇవ్వండి రాష్ట్రాన్ని జపాన్, కొరియా చేస్తా అంటూ డాంభికాలు పలికారు. కాని నిజానికి నాటి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే దినవారి ఖర్చులకి కూడా ఖజానాలో పైసలు లేక ప్రభుత్వ స్థలాలు , భవనాలు అమ్మి జీతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు.
అలాగే చంద్రబాబు ఒక్క సాగునీటి ప్రాజెక్టుకి డబ్బులు పెట్టకపోయే సరికి రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు పడిన ఇబ్బందులు, చేసుకున్న ఆత్మహత్యలు నేటికి ఎవరు మర్చిపోయి ఉండరు. ఈ నేపద్యంలో 1999 ఎన్నికల వేల ఓట్ల కోసం వ్యవసాయానికి ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం అంటూ గారడీ చేసి అర్ధంతరంగా మధ్యలోనే వదిలేశారు. ఫలితంగా చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఇలా ఆయన 9ఏళ్ళ పాలన మొత్తం అరచేతిలో స్వర్గం చూపుతూ గారడి చేశారు . దాని ఫలితమే ఆయనను రాష్ట్ర ప్రజలు 10ఏళ్ళు అధికారానికి దూరం చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం అనుభవం ప్రాతిపధికన, అనేక పొత్తుల సాయంతో, అలివికాని హామీల మాటున అధికారం సొంతం చేసుకున్న చంద్రబాబు తాను ఏమాత్రం మారలేదని నిరూపించుకున్నాడు. ఇచ్చిన హామీలని గాలికి వదిలేసి , పేదవాడికి జరగాల్సిన సంక్షేమాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణంలోకి తీసుకోకుండా అమరావతి పేరున భారీ స్కాములకి తెరలేపి అవి భాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా ప్రజలను మభ్య పెట్టడానికి మళ్ళీ విదేశీ నగరాల మాయకి తేలేపారు.
ఈ నేపధ్యంలోనే సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం, శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటూ మొదలెట్టి , లండన్ ఐ , కొలంబో తరహా రాజధాని , టోక్యో తరహా భవనాలు , ఘాంఘై తరహాలో ఆకృతులు, జపాన్ తరహా నిర్మాణాలు, ఇస్తాంబుల్ తరహా కట్టడాలు , ఖజకిస్తాన్ శైలి భవనాలు, చివరికి బాహుబలి సినిమాలో కోట సెట్టింగులు చూసి ఇలాంటివి కూడా కడతానన్నాడు . , రాష్ట్ర విద్యాలయాల్లో జపాన్ భాష అన్నారు, స్పెయిన్ బుల్లెట్ రైలు పై అద్యయనం అన్నారు, మొట్టమొదటి హైపర్ లూప్ రైలు మనదే అంటూ ఊదరగొట్టారు. రాష్ట్రంలో లండన్ తరహా రవాణ వ్యవస్థ అన్నారు.
ఈ పిట్టల దొర కబుర్లు చెబుతూ రైతు రుణమాఫీకి ఎగనామం పెట్టారు, డ్వాక్రా రుణమాఫీకి సున్నం పెట్టారు, ఇంటికో ఉద్యోగం తూచ్ అన్నారు, ఇంటింటికి త్రాగు నీటికి దాతల్ని చూసుకోమన్నాడు. చివరికి తూర్పు గోదావరిలో బహిరంగ సభ పెట్టి నేను హామీలు నెరవేర్చను అని చెప్పేసి ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు.
ఆయన తనయుడు లోకేష్ మాత్రం కొంత వరకూ యధార్ధవాది అనుకొంటా. తండ్రీ పోకడ చూసి సైకిల్ కి ఓటు వేస్తే ఉరి వేసుకొన్నట్టే అని ఓ బహిరంగ సభలో తేల్చి చెప్పేసాడు.