నిన్న చిలకలూరిపేట లో జనగళం పేరుతో జరిగిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మోడీ కి ఘోర అవమానం ఎదురైంది. ఆద్యంతం అన్ని వైఫల్యాలే. సభ మోడరేటరే తెలుగు చూసి చదవడానికి నానా తిప్పలు పడగా, సన్మానం ఉందా లేదా అనే సమాచారం లేకుండా మోదీ ని సన్మానించాల్సిందిగా కోరగా, కనీసం ఓ బొకే గానీ, శాలువా గాని ఏది టీడీపీ నాయకులు తీసుకురాలేదు. సన్మానం అనగానే బాబు- పవన్ లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.. చివరికి పురంధేశ్వరి తెచ్చిన ఓ విగ్రహం చేతిలో పెట్టి మమా అనిపించారు. సభలో ఆద్యంతం మోదీ అసహనం ప్రదర్శించారు ఎక్కడా చిరునవ్వు లేదు.
మోదీ సభల్లో ఇంతవరకు సభకు వచ్చిన వారిని మందలించిన చరిత్రే లేదు, మొట్టమొదటి సారి టీడీపీ కార్యకర్తలను మైక్ సెట్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇక మోదీ మాట్లాడుతుండగా పదే పదే మైక్ లు మొరాయించాయి, 15 నిముషాల స్పీచ్ లో దాదాపు 5 నిమిషాలు మైక్ కట్ అయింది. ఏమి మాట్లాడకుండా ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నిలబడే ఉండటం బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రధానికి జరగని అవమానం. మరో పక్క జనసమీకరణ సరిగా జరగక కేవలం స్టేజ్ ముందు ఉన్న జనాలనే చూపించాల్సిన పరిస్థితి, డ్రోన్ విజువల్స్ కోసం రోడ్డుకు అడ్డంగా కార్ లు ఆపి ప్రయాణికులను రోడ్డు పై ఇబ్బందులకు గురిచేసి మరీ వీడియో తీసుకుంటే అక్కడ 500 మీటర్ల మేర కూడా వాహనాలు ఆగిలేవు. ఇంత భారీస్థాయి తుస్సుమన్న సభ మోదీ తన 22 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూసి ఉండడు..
ఈ మొత్తం వైఫల్యాన్ని బాబు పత్తిపాటి పుల్లారావు మీద నెట్టేసినట్టు సమాచారం. బొకేలు, శాలువాలు కూడా తీసుకురాలేదని, మైక్ సెట్ గురించి కనీసం పట్టించుకోలేదని, సభ నిర్వహణ మీద ఏ మాత్రం శ్రద్ధ వహించలేదని బాబు పట్టిపాటిపై ఆగ్రహించాడని సమాచారం. వింత ఏమిటంటే సభ జరపాలని నిర్ణయించి స్థల నిర్ణయం జరిగాక, ఆ సభాస్థలం లో భూమి పూజ చేసింది లోకేష్, లోకేష్ ఆద్వర్యంలో ఈ సభ కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతుందని, అన్నీ తానై లోకేష్ చూసుకోబోతున్నాడని టీడీపీ క్యాడర్ తెగ ఊదర గొట్టింది కూడా, కానీ లోకేష్ అసలు సభకే రాలేదు. ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని భావించి, మోదీ హాజరవుతున్న సభకు లోకేష్ రాకపోవడం ఆశ్చర్యం. సభ సక్సెస్ అయ్యుంటే ఖచ్చితంగా లోకేష్ ఖాతాలో వేసి ఉండేవారు కానీ అది అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో దానికి పత్తిపాటిని బలిపశువును చేసేశారు…