మాతో పొత్తు పెట్టుకోండి మహాప్రభో అంటూ చంద్రబాబు ఫిబ్రవరి ఏడో తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను ప్రాధేయపడ్డారు. ఏమి చెప్పినా చేస్తానని, ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తానని తనను కలుపుకొని పోవాలని బతిమిలాడారు.
భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారు కాగానే ఎన్నాళ్లో వేచిన ఉదయం పాట పాడేందుకు అటు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కానీ కమలం పెద్దలు ఏ విషయం తేల్చకుండా సస్పెన్స్లో పెట్టారు. దీంతో బాబు, సేనాని నిరీక్షించలేక.. టెన్షన్ భరించలేక తెల్లమొహాలు వేశారు.
మాతో పొత్తు పెట్టుకోండి మహాప్రభో అంటూ చంద్రబాబు ఫిబ్రవరి ఏడో తేదీన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను ప్రాధేయపడ్డారు. ఏమి చెప్పినా చేస్తానని, ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తానని తనను కలుపుకొని పోవాలని బతిమిలాడారు. పాత విషయాలు మార్చిపోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరాలని వారే పిలిచినట్లు బిల్డప్ ఇచ్చారు. ఎల్లో మీడియా కూడా అదే గ్యాస్ కొట్టింది. కాగా బాబు మాట్లాడి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఇంకా కమలం పార్టీ పొత్తును ఖరారు చేయలేదు. బయటికి సీట్ల విషయం సర్దుబాటు కాకపోవడమని చెబుతున్నారు. కానీ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తానని చంద్రబాబు చెప్పేశారు. అయితే వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారా వారు 2019లో కాంగ్రెస్తో కలవడం, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయడం, ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతం తిట్టడం తదితర వాటిపై కాషాయ పెద్దలు గుర్రుగా ఉన్నారు. అయితే బాబు మనుషుల ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో తర్జనభర్జన జరుగుతోంది. ఈలోగా ఏపీలో సేన, టీడీపీలో టికెట్ల గొడవ రోజురోజుకు పెరిగిపోతోంది.
బీజేపీ ఒడిలో వాలే వ్యవహారం తేల్చాలని టీడీపీ అధినేత.. పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించారు. ఆయన మంత్రాంగం నడపడంతో హస్తిన పెద్దల నుంచి ఆయన ఒక్కరే రావాలని పిలుపు వచ్చింది. దీంతో బాబు కొంత అసంతృప్తికి గురైనా ఎగిరి గంతేసినంత పని చేశారు. ఇంకేముంది పొత్తుకు ఓకే చెప్పేస్తారు. వాళ్లకు సీట్లు ఇచ్చి నేను సీఎం అయిపోతానని సంబరపడ్డారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రెండు రోజుల క్రితమే సేనాని ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా.. బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ను రద్దు చేసి.. ఇప్పుడు కాదు.. మళ్లీ చూద్దామని, అక్కడే ఉండని చెప్పారు. దీంతో ఢీలా పడిపోయిన పవన్ హైదరాబాద్కు పరిమితమయ్యారు. అసలు పొత్తు ఉంటుందా? లేదా? అని అర్థం గాక చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు.
చంద్రబాబు గురించి కాషాయ పార్టీ పెద్దలకు బాగా తెలుసు. అందువల్ల వారు పొత్తు ప్రతిపాదన తీసుకురాగానే పక్కన పడేశారు. కానీ పవన్ కళ్యాణ్ వారి వెంట పడ్డారు. ఈ విషయాన్ని స్వయానే ఆయనే ఇటీవల నేతల సమావేశంలో చెప్పారు. బాబుతో పొత్తుకు బీజేపీ పెద్దలు ఒప్పుకోవడం లేదని, తాను ప్రయత్నించి వారి నుంచి నానా తిట్లు తిన్నట్లు వెల్లడించారు. దీనిని బట్టి పొత్తు అవసరం బాబు, పవన్కే ఉంది. కమలం పార్టీకి ఏ మాత్రం లేదు. దీంతోనే ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, మరికొందరు టీడీపీతో కలుద్దామని పార్టీ పెద్దలకు చెప్పారు. కానీ వారు ఇది మీకు సంబంధం లేని వ్యవహారం. దూరంగా ఉండాలని చెప్పడంతో స్థానిక మీడియాతో అంతా అధిష్టానం చూసుకుంటుందని కవర్ చేసుకుంటున్నారు. ఇక్కడి ఎల్లో గ్యాంగ్ హస్తిన నుంచి కబురు అందే వరకూ ఎదురు చూడాల్సిందే తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. కావాలంటే ఈలోగా పాత పాటలు వినుకుంటూ ఉండొచ్చు.