తనని 7 సార్లు గెలిపించిన కుప్పం వాసుల కోసం ఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోయినా, కనీసం ఒక నియోజకవర్గ ప్రధాన కేంద్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేయకపోయినా మాఫియా కి మాత్రం అడ్డాగా కుప్పాన్ని మార్చాడు బాబు. మొదటిసారి సీఎం అవ్వగానే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనం మీద దాని అక్రమ రవాణా మీద ముందునుండే కన్ను ఉన్న బాబు కుప్పాన్ని ఆ స్మగ్లింగ్ కు ప్రధాన కేంద్రం చేసి దేశవ్యాప్తంగా సరుకు రవాణాకు కేంద్రంగా మార్చాడు…
ఈ విషయం పై తమిళనాడు సీబీసీఐడీ వారు 1996 లో విచారణ చేపట్టగా ఈ చీకటి దందా వెలుగులోకి వచ్చింది. కుప్పం నుండి ఉత్తరభారత దేశం లో ఎర్రచందనం డీలర్ల కు రవాణా చేస్తున్నట్టు, కుప్పం కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తమిళనాడు పోలీస్ వారి నివేదిక ఇచ్చినా ఆనాటి బాబు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు.. కారణం ఆ మొత్తం స్మగ్లింగ్ ముఠాను ప్రోత్సహించిందే బాబు. బాబు కనుసన్నల్లోనే అదంతా జరింగింది. 2014-19 మధ్య కూడా కుప్పం కేంద్రంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినట్లు ఆరోపణలు రాగా, దాన్ని కప్పిపుచ్చడానికి అభం శుభం తెలియని తమిళనాడు కు చెందిన కూలీలను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి వేయించాడు. ఈ విషయం పై తమిళనాడు-ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకుంది…
ఇక జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక, 7 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు సీఎం గా ఉండి కూడా చేయలేకపోయిన కుప్పం కి మున్సిపాలిటీ స్థాయిని కల్పించాడు, తను చదువుకున్న బడిని కూడా ఏనాడూ బాగు చేయాలని ఆలోచన బాబుకి రాలేదు, ఆ పని కూడా నాడు నేడు లో భాగంగా జగన్ ప్రభుత్వం చేసి చూపించింది.. సిగ్గు లేకుండా జగన్ వస్తే ఖాళీ బిందెలతో నిరసన తెలపండి అని పిలుపు ఇస్తే, శ్రీశైలం నుండి కుప్పానికి నీళ్లు అందించింది జగన్ ప్రభుత్వం..
ఇప్పుడు కుప్పం ప్రజల దృష్టి జగన్ వైపుకు మరలేసరికి బాబు వెన్నులో వణుకుపుట్టింది.. వైనాట్ కుప్పం అని జగన్ ఇచ్చిన పిలుపుకు కూసాలు కదిలి ఎన్నడూ లేని విధంగా తరచూ కుప్పం పర్యటనలు చేస్తున్నాడు బాబు. చివరికి కుప్పం పోటీ నుండి తప్పించుకుని తన భార్యను నిలబెట్టాలని కూడా ఫీలర్ వదిలాడు. కుప్పంలోనే గెలుస్తాం అనే దైర్యం చేయని బాబు రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా గెలుస్తాడు అనే విమర్శ ను తట్టుకోలేక ఇక తప్పక కుప్పం నుండే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది..