శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్బాబు ఊరిని దత్తత తీసుకుని బాగు చేయాలనుకుంటాడు. ప్రజల జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తుంటాడు. ఇందుకు సీనియర్ విలన్గా నటించిన ముకేష్రుషి అంగీకరించడు. కేంద్ర మంత్రి అయిన అతను మొదటి నుంచి పెత్తందారీ పోకడలతో ఉంటాడు. అవినీతి చేసి రూ.వేల కోట్లు సంపాదించి ఉంటాడు. పేదలకు మంచి చేయాలని చూసిన మహేష్ను ఇబ్బందులకు గురి చేస్తాడు. ఈ మూవీలోని విలన్ను నిజ జీవితంలో ఒకరితో పోల్చవచ్చు. ఆయనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదు. ఎంతసేపు, తాను, తన వర్గం సంపాదనపై దృష్టి సారించారు. ఎవరైనా పేదలకు అండగా నిలిస్తే వారికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని తట్టుకోలేకపోయేవారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భరోసాగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నారా వారికి విపరీతమైన కోపం ఉంది. అందుకే ఆయన ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారు. జగన్ను అభిమానిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం పట్టిన వారిని కష్టాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుని పైశాచిక ఆనందం పొందుతున్నారు.
ఇలా చేయడం చంద్రబాబుకు కొత్త కాదు. పేదలకు మంచి జరిగితే వారు తనను ఎన్నికల్లో పట్టించుకోరని కుట్రలు పన్నడం ఆయనకు అలవాటే. 2009లోనూ ఇదే జరిగింది. 2004లో సీఎం అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ఆరోగ్యశ్రీ ఒకటి. ఇది పేదలకు ఎంతో ఉపయోగపడింది. లక్షల మంది కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం వేయించుకున్నారు. దీంతో 09 ఎన్నికల్లో ఎక్కడ రాజన్నపై ప్రజలు అభిమానం చూపిస్తారోనని బాబు దానిని ఆపించాలని చూశారు
రాజశేఖరరెడ్డిని ఓడించలేనని అర్థం కావడంతో బాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా వచ్చారు. ఎన్నికలయ్యే వరకు ఆరోగ్యశ్రీని నిలిపివేసి, వైద్య సేవల్ని స్తంభింపజేయాలని చంద్రబాబు పొత్తులోని పార్టీలతో కలిసి ఈసీకి నివేదించారు. దీంతో రాజన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, పేదల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా అభివర్ణించారు. అప్పటికే 15 లక్షల మంది ఉచితంగా వైద్యసేవలు పొందారు. ఈ పథకం ఆగిపోతే డబ్బు లేని నిరుపేదలు వైద్యం చేయించుకోలేరు. ఎవరైనా చనిపోతే ప్రాణాలను విపక్షాలు తిరిగి తెస్తాయా అని ప్రశ్నించారు. అందువల్ల పథకాన్ని ఆపించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విన్నవించారు.
చంద్రబాబు ఎలాంటి వ్యక్తో ఇప్పుడు అర్థమైంది కదా.. ప్రజలకు తాను మంచి చేయడు. చేసే వారిపై బురద వేస్తాడు. రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని చూస్తాడు. నాడు వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపించాలని చూశాడు. నేడు వలంటీర్లను పక్కన పెట్టించి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్లు అందకుండా కుట్రలు చేశాడు. ఇటీవల మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ బాబును ‘పసుపు’పతిగా అభివర్ణించారు. బొమ్మాళీ వదలా అంటూ పేదల రక్తాన్ని పీల్చడానికి వస్తున్నాడని, నమ్మొద్దని కోరారు. ఆయన మాటలు అక్షరాల నిజం.