2019 ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ ప్రజల్ని నమ్మించేందుకు పలు యాత్రలకు శ్రీకారం చుట్టారు బాబు. వాటికి పేర్లు కూడా భలే పెట్టారు. ముందుగా బాదుడే బాదుడు అంటూ తలబాదుకుంటూ ఒక యాత్ర, తర్వాత, ఇదేం ఖర్మ (నాకు) అంటూ ఒక యాత్ర, మొన్నటిదాకా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ వింత వింత యాత్రలు చేసిన బాబు ప్రజాగళం అంటూ మరో యాత్రకు శ్రీకారం చుట్టాడు.. గతంలో చేసిన మూడు యాత్రల్లో కామన్ పాయింట్ ఏంటంటే మూడిట్లో జనాలు లేకపోవడమే..
“బాదుడే బాదుడు” అన్నప్పుడు అయ్యా తమరు ఉన్నప్పుడు బాదిన బాదుడు ఇప్పుడు లేదండి, మేం బానే ఉన్నాం అని జనాలు రాలేదు, “ఇదేం ఖర్మ” రాష్ట్రానికి అన్నప్పుడు మా ఖర్మ 2019 లోనే తీరిపోయింది ఇప్పుడు ఖర్మ పట్టింది నీకు గానీ మాకు కాదని జనాలు ఈసడించుకున్నారు. ఇక ఇవన్నీ నడిచేలా లేవని “బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ” అంటూ తిరిగాడు… నీ గ్యారెంటీలు అన్నీ ఎలక్షన్స్ కు ముందు చూపెట్టిన మేనిఫెస్టో ని ఎలక్షన్స్ అయిపోయాక కంటికి కానరాకుండా పార్టీ వెబ్సైట్ నుండే తీసేసినట్లు, 1100 టోల్ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తే మీ సమస్యలు ఒక్కరోజే తీర్చేస్తా అని కాల్ చేసి సమస్య చెప్పుకుంటే సాయంత్రం మళ్లీ తిరిగి కాల్ చేసి మీ సమస్య తీరిపోయింది పోండి అని చెప్పి మర్చిపోయిన లక్షల సమస్యల గ్యారంటీ లానే ఉంటాయి లే బాబు అని ప్రజలు అలా కూడా పట్టిచుకోలేదు..
ఇప్పుడు ప్రజాగళం అంటూ మరో టైం పాస్ యాత్ర మొదలు పెడుతున్నాడు.. కాకపోతే అది ప్రజాగళం కాదు, బాబు గరళమే, ప్రజా గళం అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి గానీ, బాబు దగ్గర అవేం ఉండవ్, ఎంతసేపూ తన భాద, తన సీఎం సీట్ బాధ, తన భార్యని అవమానించారాంటూ చెప్పుకొనే బాధ, తను చేసిన అవినీతికి ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో అని వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకునే వ్యవహారమే తప్ప ప్రజాసమస్యల మీద అవగాహన ఏముంటుంది? ఎప్పుడైనా ప్రజల సమస్య వింటే కదా? ఎప్పుడు ఓ పెద్ద సినిమా సెట్టు తరహాలో స్టేజ్ కట్టించి దాని మీద నుండి, మైకు దొరికితే మళ్లీ మైకు ఇవ్వరేమో అన్నట్లు చెప్పిన సోదే చెప్పీ, చెప్పీ టీడీపీ కార్యకర్తలకే విసుగు పుట్టిస్తాడు…
ఎన్ని చేసినా టీడీపీ ఇంచు కూడా పైకి లేవడం లేదని బాబుకు అర్థం అయినా ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నాడిప్పుడు బాబు….