చంద్రబాబు నాయుడు తన పార్టీ లోకి కోటీశ్వరులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు అని జగమెరిగిన సత్యమే. చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన తరువాత పార్టీ కార్యక్రమాల కోసం ప్రచారం కోసం పార్టీలోకి కొత్తగా ఎన్నారైలను మరియు ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశ చూపి ఖర్చు పెట్టే బాధ్యతను అప్పగించారు.చంద్రబాబు హామీతో ఆ ఎన్నారై లు , పారిశ్రామిక వేత్తలు టీడీపీ పార్టీ సంబంధించిన ప్రతి కార్యక్రమం కు కోట్లు ఖర్చు చేశారు, లోకేష్ యువగళం, చంద్రబాబు బాదుడే బాదుడు, లోకేష్ మరియు చంద్రబాబు విడివిడిగా ప్రజగళం పేరుతో చేపట్టిన ప్రతి కార్యక్రమంకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశ చూపించి కోట్లు ఖర్చు పెట్టించారు. చివరకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు మార్క్ వెన్నుపోటు పొడిచారు.
టీడీపీ లో కొత్తగా జాయిన్ అయ్యి మొన్నటివరకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అంటూ ప్రచారం జరిగిన దిలీప్ చక్రవర్తి టీడీపీకి 30 కోట్ల ఫండ్ డిపాజిట్ చెయ్యడమే కాకుండా పార్టీకి సంబందించిన ప్రతి కార్యక్రమంకు పదుల కోట్లలో ఖర్చు చేశారు.చివరకు ఆ టికెట్ కూటమిలో భాగంగా బిజెపికి ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడుకు కుడి భుజం అయిన సిఎం రమేష్ కు టికెట్ ఇప్పించుకున్నరు. దీనితో దిలీప్ చక్రవర్తి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చంద్రబాబు నాయుడి, అయన తనయుడు లోకేష్ మాటలను నమ్మి పార్టీ కోసం కోట్లకి కోట్లు ఖర్చు చేశాను చివరకు చంద్రబాబు నాయుడు కనీసం తనకు కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు అటూ టికెట్ నాకు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు అని భోరున విలపిస్తున్నారు.
ఇటు భీమిలి నియోజకవర్గంకు సంబంధించి బంగార్రాజుకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ లు టీడీపీ ప్రతి కార్యక్రమంకు కోట్లలో ఖర్చు పెట్టించారు, పార్టీకి నిధుల పేరిట 20 కోట్లు డిపాజిట్ కూడ చేపించుకొని తీరా ఎలక్షన్స్ వచ్చే సరికి మాత్రం గంటా కు అవకాశం ఇచ్చారు. మధ్యలో బంగార్రాజు లోకేష్ తో మీరు గంటా శ్రీనివాస్ కు టికెట్ ఇస్తా అంటున్నారు అని ప్రచారం జరుగుతుందని చెబితే అలాంటి మాటలు పట్టించుకోవద్దు టికెట్ మీకే ఇస్తున్నాం అని చెప్పి భీమిలీ సభకు భారీగా ఖర్చుపెట్టించారు. ఇప్పుడు తీరిగ్గా ఆ సీటు గంటా శ్రీనివాస్ కు కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఈ విషయం మీద బంగార్రాజు తండ్రీకొడుకులను కలుద్దాం అని చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ ఇద్దరికీ టీడీపీ పెద్దలు మీకు పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ, రాజ్య సభ ఇస్తాము అని నిధుల గురించి అయితే ఎలక్షన్స్ తరువాత ఆలోచన చేద్దాం అంటూ తప్పించుకు తిరుగుతున్నరు. ఇలా వుంటాది చంద్రబాబు రాజకీయం. అసలు చంద్రబాబును నమ్మి బాగుపడిన ఒక్క నాయకుడు లేడు అని మరొకసారి ప్రూవ్ అయింది.