చంద్రబాబు అంటేనే మోసం అన్న విషయం వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోని జాయిన్ అయిన మహిళా నేతలకు అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది. సాధారణ మహిళలకి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అనే ఉద్దేశంతో కొంత మందికి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు. గతంలో జరిగిన రెండు ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసి గెలిచిన మహిళా నేతలు ప్రలోభాలకి ఆకర్షితులై తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారే సమయంలో ఆర్ధికంగా ప్రలోభ పెట్టి తీసుకోని , తర్వాత రాజకీయపరంగా ఏ మాత్రం అవకాశం లేకుండా చంద్రబాబు వారిని అణగదొక్కారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన వారిలో గతంలో పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి, 2014 ఎన్నికల సమయంలో అనూహ్యంగా రంపచోడవరం నుంచి సీటు దక్కించుకున్న రాజేశ్వరి, పామర్రు నుంచి గెలిచిన ఉప్పలేటి కల్పన, తాడికొండ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవికి రానున్న ఎన్నికల్లో టిడిపి తరఫున చంద్రబాబు నాయుడు సీటు నిరాకరించాడు. సీట్ ఇవ్వకపోవడంతోపాటు కనీసం ఎందుకు ఇవ్వలేదు కూడా సరైన సమాచారం అందించలేదు.
గిడ్డి ఈశ్వరి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాడేరు నియోజవర్గానికి సమన్వయకర్తగా నియమించాడు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ కేటాయించడంతో గిడ్డి ఈశ్వరి పాడేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో ప్రలోభాలకు గురై టీడీపీలో జాయిన్ అయ్యింది. 2019లో టిడిపి తరఫున సీట్ కేటాయించగా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో డబ్బు లేదనే కారణం చేత టిడిపి సీట్ కేటాయించలేదు. అలా జగన్మోహన్ రెడ్డి నమ్మి సీట్ కేటాయించిన మహిళ చంద్రబాబు చేతిలో మోసపోయింది.
రంపచోడవరంకి చెందిన వంతల రాజేశ్వరి 2014 ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇతర కారణాలు చేత డిస్ క్వాలిఫై కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజేశ్వరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించింది. వంతల రాజేశ్వరి 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన అనంతరం అధికార తెలుగు దేశం పార్టీ ప్రలోభాలకి గురై 2017లో టిడిపి తీర్థం పుచ్చుకుంది. 2019లో టిడిపి తరుపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో డబ్బు లేదనే కారణంతో టిడిపి తరఫున సీట్ కేటాయించలేదు.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో రాజకీయ అరంగ్రేటం చేసింది ఉండవల్లి శ్రీదేవి. 2019లో తాడికొండ నుంచి అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి గెలిచింది. 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ చేసిన ప్రలోభాలకు గురై టీడీపీ తరుపున పోటీ చేసిన వారికి ఓటు వేయడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ బహిష్కరించింది. దానితో టీడీపీ పార్టీ లో జాయిన్ అయ్యింది. జాయిన్ అయ్యన తర్వాత మొదట తాడికొండ సీట్ కేటాయిస్తాం అని తెలిపారు తర్వాత తిరువూరు సీట్ కేటా ఇస్తాం అని తెలిపారు, అక్కడ కొలికిపుడి శ్రీనివాస్ రావు కి సీట్ కేటాయించడంతో బాపట్ల పార్లమెంట్ తరుపున ఎంపీ అభ్యర్థిగా సర్వే చేయించి సీట్ కేటాయిస్తాం అని తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తికి సీట్ కేటాయించి ఉండవల్లి శ్రీదేవికి సీట్ నిరాకరించారు.
పామర్రు నుంచి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉప్పులేటి కల్పన 2016లో టిడిపి తీర్థం పుచ్చుకుంది. అప్పటికే రెండు సార్లు టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయిన కల్పన 2012లో వైఎస్ఆర్సీపీ లో జాయిన్ అయ్యింది. 2014లో పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన కల్పన రెండు సంవత్సరాలకి పార్టీ మారిపోయింది. 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున సీట్ కేటాయించలేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి నమ్మి సీట్ కేటాయించిన నలుగురు మహిళలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేయడం, ఆ నలుగురు మహిళా నేతలను చంద్రబాబు మోసం చేయడం విధి విచిత్రం.