టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు ఖరారైన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఈరోజు సాయంత్రం జరగబోతున్న బహిరంగసభకు మోదీ హాజరవుతున్నారు.. అయితే ఒకప్పుడు మోదీ అంటేనే ఒంటి కాలి మీద లేచే చంద్రబాబు ప్రస్థుత ఎన్నికల నేపథ్యంలో మాత్రం బీజేపీ పార్టీతో పొత్తుకు వెంపర్లాడాడు. నాడు బీజేపీ పార్టీ నాయకులన్నా ముఖ్యంగా నరేంద్ర మోదీ అన్నా చంద్రబాబుకు గిట్టేది కాదు. జాతీయస్థాయిలో నాయకులను ఏకంచేసి మోదీకి వ్యతిరేక కూటమి ఏర్పాటుచేస్తానంటూ ఎగిరిన చంద్రబాబు నేడు మోదీతో కలిసి ఎన్నికల ప్రచారానికై ఒక వేదికను పంచుకోబోతున్నాడు.
విభజన హామీలు తీర్చినాకే ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టండంటూ ఒకప్పుడు చంద్రబాబు ప్రధానమంత్రి మోదీకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టుకోని బీజేపీతో పొత్తుకు పూనుకున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న దగాకోరు రాజకీయాలు ప్రజలు గుర్తించలేరు అనుకున్నాడేమో.. నాడు.. బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ధర్మపోరాట దీక్షలు, నిరసన దీక్షలు, నవనిర్మాణ సంకల్ప సభలు ఇన్ని చేసి నానాయాగీ చేసిన చంద్రబాబు.. నేడు అదే చంద్రబాబు పొత్తులో భాగంగా మోదీ ఆంధ్ర రాష్ట్రానికి అన్నీ చేశారు.. ఒక్క హోదా తప్ప అన్ని చేశారు అని చెబుతున్నాడు.. అంటే అప్పుడు చెప్పిన మాటలకు అర్ధం లేదా..
చంద్రబాబు అందితే జుట్టు పట్టుకుంటాడు.. లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు.. ఏదో ఒకటి చేసి ఎన్నికలలో గెలిచేందుకు చూస్తాడంతే… మళ్ళీ చంద్రబాబు మోదీని తిట్టే రోజు కూడా వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలు చేసే నిలకడలేని మనిషి చంద్రబాబని అర్ధం చేసుకొనే అమాయకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది .