వైస్సార్సీపీ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ భవన నిర్మాణాల నిమిత్తం కేంద్ర పర్యావరణ అనుమతి మేరకు చదును చేసిన ప్రాంతాన్ని చూపుతూ ఋషికొండకి గుండు కొట్టారు, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించారు అంటూ టీడీపీ, ఎల్లో మీడియా చేసిన యాగీ చూస్తూనే ఉన్నాం. అసలు ఋషికొండ విషయంలో ఎవరు ఏం చేశారు అనేది తరచి చూస్తే 1996 లోనే చంద్రబాబు వైజాక్ కి మణిహారంలాంటి ఋషికొండతో పాటు, విజయవాడకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే భవానీ ద్విపాన్ని కూడా పది పరకా చిల్లరకి అమ్ముకొన్న భయంకర నిజం బయట పడింది .
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి చంద్రబాబు ఆ వెంటనే రాష్ట్రంలోని అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తుల పై, పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల పై కన్నెశాడు. ఆ క్రమంలోనే వైజాక్ ఋషికొండ, విజయవాడ భవానీ ఐలాండ్స్ బాబు కంట్లో పడ్డాయి .
ఆ వెంటనే ఈ రెండిటిని 99 ఏళ్ల పాటు లీజుకి ఇస్తామంటూ 1995 డిసెంబర్ లో టెండర్లు పిలిచాడు బాబు. అయితే ఋషికొండ టెండర్లలో పాల్గొని అధిక బిడ్డింగ్ చేసిన వారికీ ఇవ్వకుండా నిభందనలు తోసిరాజని తన సన్నిహితులైన ఐఏఎస్ అధికారుల బంధువుల పేరిట ఉన్న తూషాలీ రిసార్ట్స్ అనే ప్రైవేట్ సంస్థకి అప్పనంగా 99 ఏళ్ల పాటు, సంవత్సరానికి 5 లక్షల లెక్కన లీజుకు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని 1996 మే14 వ తారీఖున జీవో విడుదల చేసి వారికి వందల ఎకరాల ఋషికొండ కట్టబెట్టేసాడు చంద్రబాబు.
అలాగే విజయవాడ భవానీ ఐలాండ్ కూడా టెండర్లలో అత్యధికంగా సంవత్సరానికి 18 లక్షలు చెల్లిస్తామని కోట్ చేసిన వారిని కాదని తన సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు జిల్లా వాసి రాధాకృష్ణ రాజు వారి లోటస్ కన్స్ట్రక్షన్ కంపెనీకి కేవలం యాడాదికి రెండు లక్షల రూపాయల నామమాత్రపు ధరకి విజయవాడ ముఖద్వారంలో కృష్ణా నది నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన భవానీ ఐలాండ్ కట్టబెట్టేసాడు బాబు .
ఈ అంశం పై కాంగ్రెస్ నేత అప్పటికే పర్యాటక శాఖ మంత్రిగా పని చేసి ఉన్న గీతా రెడ్డి 1996 జులై 12 న విలేకరుల సమావేశం పెట్టి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ ఆడ్డగోలు దోపిడీ విషయాన్ని ప్రజలకు వెల్లడించగా, అదే రోజు మీడియాతో మాట్లాడిన నాటి టీడీపీ మంత్రి అశోక గజపతి రాజు ప్రెస్మీట్ పెట్టి ఋషికొండని ఎవరికి అమ్మలేదు అంటూ అమ్మేసిన నెల తర్వాత కూడా బుకాయించడం గమనార్హం. ఈ అంశం పై నిజానిజాలు తెలియాలంటే జీవో సంభంధిత ఫైల్లు బయట పెట్టాలని గీతా రెడ్డి సవాల్ చేయగా, ఆ ఫైల్లు బయట పెట్టవద్దన్న చంద్రబాబు ఆదేశాలతో అశోక గజపతి రాజు సవాల్ నుండీ పలాయనం చిత్తగించాడు.
అసలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పర్యాతక ప్రదేశాలలో 25 ఏళ్లకి మించి లీజుకు ఇవ్వడానికి వీలు లేదు, దానికి కూడా కాబినెట్ ఆమోదం ఉండాలి. కానీ ఇవన్నీ తుంగలో తొక్కి అప్పనంగా ఒక ప్రైవేట్ సంస్థకి రిసార్టులు కట్టడానికి, అన్ని నిభందనలు పక్కన పెట్టి అయిదు లక్షలకి కొండ మొత్తం రాసిచ్చిన చంద్రబాబు ఇప్పుడు రుషికొండ గురించి చేస్తున్న పోరాటం చూస్తే దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు ఉంది.
ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కోర్టుకి వెళ్లడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ప్రభుత్వాన్ని మందలించి ఆ జీవో రద్దు చేయడంతో ఋషికొండ చంద్రబాబు కబంద హష్టాల్లోకి పోకుండా మిగిలింది. భావి తరాల ఆస్తి అయిన ఋషికొండని కాపాడిన విషయంలో వైజాగ్ వాసులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాటి కాంగ్రెస్ నేత గీతా రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
ఇలా చంద్రబాబు చేసిన ప్రతి ఆర్ధిక నేరం ఎప్పటికప్పుడు ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు అనే స్థాయిలోనే ఉండటం విశేషం.
అలాంటి వాటిని అన్నిటిని తెలుసుకోవటానికి మా కోస్తా life ఛానెల్ సబ్స్క్రయిబ్ చేయండి