తెదేపా హయాంలో కరకట్ట వేదికగా జరిగిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కాదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రజావేదిక కట్టింది కూడా కరకట్ట మీదనే. అయితే ఎంతసేపు సొంత లాభం మాత్రమే చూసుకునే చంద్రబాబు కరకట్టకు అవతల తనకు కావలసిన సదుపాయాలతో అన్ని రకాల హంగులు చేయించుకున్నారు కానీ, కరకట్ట దిగువన ఉండే వారి గోడు మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు.
ఎందుకంటే వాళ్ళేమీ పెట్టుబడులు తీసుకురావాలి పారిశ్రామికవేత్తలు కాదు. వాళ్లంతా వివిధరకాల వృత్తి, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఐదు దశాబ్దాల కిందట కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో కరకట్ట దిగువున నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉండేవి. ఆ పొంగిన కృష్ణ నీరు ఇళ్ళ మధ్యకి చేరి వరద ఉన్నన్ని రోజులూ వారి జీవనం అస్తవ్యస్తంగా తయారయ్యేది. అయితే జగన్ హయాంలో ఇప్పుడు కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతం లో సుమారు 134 కోట్ల ఖర్చుతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి అయింది. దాంతో రణధీర్ నగర్ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినా ఇక ముంపు చింత లేదని సంతోషం వ్యక్తం చేస్తు న్నారు.
ఇప్పటి వరకూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అనంతరం వాటిని మర్చిపోయిన నేతలను చూశారు కానీ ఇలా ఎలాంటి హామీ ఇవ్వకుండానే కష్టాలు తొలగిపోయేలా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్రెడ్డి కి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నారు.
తొలుత కనకదుర్గమ్మ వారధి దిగువ, వారధి ఎగువన నిర్మించిన రిటైనింగ్ వాల్ ప్రాంతంలోనే రిటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రతిపాదన కాగా, ఎగువ ప్రాంతంలో కూడా ముంపు సమస్య ఉందని తెలుసుకుని, ప్రజల ఇబ్బందులు తొలగిపోయేలా రక్షణ గోడ నిర్మించారని ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాంతంలో పర్యటించారు. రాణిగారితోట, తారకరామనగర్, భూపేష్ గుప్తా నగర్ తదితర ప్రాంతాల ప్రజలను పరామర్శించి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రక్షణ గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కన కదుర్గమ్మ వారధి దిగువన సుమారు రూ.225 కోట్లతో రెండు విడతలుగా రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. అనంతరం ఎగువ ప్రాంతంలో కూడా ముంపు సమస్య ఉందని వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ సీఎం వైఎస్ జగన్కు చెప్పడంతో రూ.135 కోట్లతో 1.05 కి.మీ మేర నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.