ఢిల్లీకి వెళ్లి నేరుగా కలిసి బతిమిలాడాను. రోజులు గడుస్తున్నాయి తప్ప ఈ బీజేపీ వాళ్లు పొత్తుల సంగతి తేల్చడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోలోన మదనపడిపోతున్నారు. సీట్ల విషయం తేల్చకపోవడంతో టీడీపీ, జనసేన నేతలు కొట్టుకున్నంత పని చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో అర్థంగాక బాబు తల పట్టుకుంటున్నారు. దీనికితోడు కేంద్ర హోం మంత్రి అమిత్షా టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించకుండా మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. కొద్దిరోజులు వేచి చూడాలని నారా వారిని మరింత టెన్షన్లోకి నెట్టారు. ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
బాబు గత ఎన్నికల సమయంలో వ్యక్తిగత స్వార్థంతో ఎన్డీఏను వదిలి కాంగ్రెస్ను కౌగిలించుకున్న విషయం తెలిసిందే. టీడీపీ గతంలో చేసిన ఈ పని గురించి షా పరోక్షంగా మాట్లాడాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత వరకు ఏ పార్టీనీ బీజేపీ ఎన్డీఏ లోంచి బయటకు గెంటెయ్య లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతి సందర్భంలోనూ తాము కూటమి ధర్మాన్ని పాటించినట్లు వెల్లడించారు. మిత్రపక్షాలకు సముచితమైన స్థానం కల్పించామన్నారు. తమను ఉద్ధేశించే షా ఈ మాటలు అన్నారని తెలుగు తమ్ముళ్లు తెగ బాధపడిపోతున్నారు. ఆనాడు చంద్రబాబు అనవసరంగా బీజేపీ నుంచి బయటకు వచ్చాడని వాపోతున్నారు.
వీరిలా..
కమలం అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవడంతో ఏపీలోని ఆ పార్టీ ముఖ్యులకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు మనుషులుగా ముద్రపడిన వారైతే బాగా ఫీలైపోతున్నారు. వారికి పొత్తు ఇష్టమైనా పెద్దలు ఏమీ చెప్పకపోవడంతో మీడియా ముందు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ చీఫ్ పురందేశ్వరి స్పందిస్తూ రాష్ట్ర పరిస్థితులను బట్టి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. ఓ వైపు మా కార్యకర్తలకు పొత్తులపై ఎటువంటి కన్ఫ్యూజన్ లేదంటూనే పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్నారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పందిస్తూ టీడీపీతో పొత్తుపై అమిత్షా నిర్ణయిస్తారని బంతి వారి కోర్టులోనే ఉందని చెప్పకనే చెప్పారు. ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదన్నారు. సీట్ల కేటాయింపు అంశం ఇంకా ప్రస్తావనకే రాలేదని, అన్ని జాతీయ పార్టీ చూసుకుంటుందని తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ తమతో ఆడుకుంటోందనే భావన కొందరు దేశం నాయకుల్లో ఉంది. కానీ భవిష్యత్ కావాలంటే తప్పదని చంద్రబాబు సర్దిచెబుతున్నారు. కమలం పెద్దలూ పొత్తు సంగతి త్వరగా తేల్చండి.