ప్రతిపక్షంలో ఉన్న ప్రతీసారి చంద్రబాబు చెప్పే మాట, ” సంపద శృష్టిస్తా, పేదలకు పంచుతా”, ఎలా పెంచుతావు అంటే మాత్రం సరైన సమాధానం ఉండదు.. సమాధానం చెబితే ప్రజలు ఓట్లెయ్యరు కదా అందుకే చెప్పడు చంద్రబాబు సంపద పెంచే విధానం ఏమిటనే దానికి ఒక ఉదాహరణగా 1996లో వచ్చిన ఈ వార్త చూస్తే మనకి అర్ధం అవుతుంది… అప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, మద్యపాన నిషేధం ఎత్తేసి విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బార్ లు బెల్ట్ షాపులు తన వారికి ఇచ్చుకోవడం నుండి మొదలు బాబు చేష్టలు అన్నీ బహు బాగుండేవి….
“సంపద పెంచడానికి ధనికులపై పన్ను భారం వేస్తా” ప్రజల కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకోడానికి సిద్ధం అంటూ వీర లెవల్ లో ప్రకటించి, ఒక్కరోజు గడవకుండానే ఆ మరుసటి రోజే , ఆర్టీసీ చార్జీలు పెంచుతూ నిర్ణయం, కిలో రెండు రూపాయలకి ఇస్తున్న సబ్సిడీ బియ్యం ధర పెంచుతూ నిర్ణయం, విద్యుత్ చార్జీలు పెంచుతూ నిర్ణయం అంటూ పిడుగులు కురిపించారు బాబు .
అంటే బాబు దృష్టిలో ఆర్టీసీ బస్సు ఎక్కేవారూ, కిలో రెండు రూపాయలకి రేషన్ బియ్యం కొనుక్కుని తినేవారు, ఇంట్లో విద్యుత్ వాడే వారందరూ ధనికులే… అందుకే వారిపై పన్ను భారం పెంచి వారి నడ్డి విరిచేస్తాడు… ఇహ బాబు దృష్టిలో కడు పేదలైన, పత్రికా అధినేతలు, తమ పార్టీ నాయకులు, తమ బంధువులు, స్నేహితులు పేదరిక రేఖను దాటేందుకు చిన్నా చితకా వేల కోట్ల కాంట్రాక్టులు, పెట్టని పరిశ్రమల కోసం వేల ఎకరాల భూములు అడ్డికి సేరుకి రాసిచ్చేవాడు , మనోళ్లకి పన్ను రాయితీలు ఇచ్చేవాడు…
బాబు దృష్టిలో సంపద శృష్టించడం అంటే పన్నులు పెంచడం, చార్జీలు పెంచడం, సబ్సిడీ లు ఎత్తెయ్యడం తద్వారా ఖజానాను నింపేసి… ఆ ఖజానా నుండి తన సొంత వారికి కాంట్రాక్టుల రూపంలో చెల్లింపులు, భూ పందేరం, ప్రతిపక్షం లో ఉన్నప్పుడు పేదల ఓట్లు కావాలని కౌగిలించుకుని ఎక్కడ లేని ప్రేమనంతా వొలకబోస్తూ వరాల జల్లు కురిపిస్తాడు, అధికారంలోకి రాగానే వారు పురుగుల్లా కనిపిస్తారు, వారి వెన్ను విరుస్తారు