అధికారంలోకి వస్తే సీఎం గా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ మీదే చేస్తా అంటూ ప్రజాగళం యాత్రలో బాబు హామీ ఇచ్చాడు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న బాబు ఎన్ని డీఎస్సీ లు వేశాడో ప్రజలకు తెలియనిది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు దండగ, ఉద్యోగుల సోమరిపోతులు అనే బాబు నేడు డీఎస్సీ వేస్తా ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు.
గతంలో తను తొలి సంతకం చేస్తా అన్న ఎన్ని హామీలపై సంతకం చేశాడు? అమలు చేసినవి ఎన్ని? గతంలో వ్యవసాయ రుణమాఫీ చేస్తా, దానిపైనే తొలిసంకం పెడతా అని అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మాట దేవుడెరుగు రుణమాఫీ అమలుపై సాధ్యాసాధ్యాలను చర్చించడానికి కోటయ్య కమిటీ వేసి కాలయాపన చేసి, మొత్తం 87 వేల కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సి ఉండగా అంత చేయడం కుదరదు 24 వేల కోట్ల మేరనే రుణమాఫీ చేస్తానని, అది కూడా విడతల వారీగా చేస్తామని అధికారం నుండి దిగిపోయేనాటికి కేవలం 15 వేల 114 కోట్లే రుణమాఫీ చేశాడు.
ఇంకో తొలి సంతకం హామీ: బెల్టు షాపు రద్దుపై…
విచిత్రం ఏమిటి అంటే బెల్టు షాపులు అంటేనే అక్రమం, చట్టబద్ధత లేని కార్యకలాపం అవి రద్దు చేయడానికి సంతకం పెట్టాలి అంటే ముందు అవి చట్టబద్దం గా ఉండి ఉండాలి, అక్రమం గా ఉన్న వాటిని రద్దు చేయడానికి సంతకం చేయడం ఏమిటో అప్పటికే 30 ఏళ్లకు పైగా ఎమ్మెల్యే గా చట్ట సభల్లో ఉన్న బాబుకు తెలియకపోవడం సిగ్గు చేటు. పోనీ అదైనా చేశాడా అంటే బాబు అధికారం లోకి రాకముందు రాష్ట్రంలో 20 వేల బెల్టు షాపులు ఉండగా, 2019 లో అధికారం కోల్పోయే నాటికి అవి 46 వేలకు చేరాయి. బెల్టు షాపులు రద్దు చేయడం కాదు ఉన్నవాటిని డబుల్ చేశాడు బాబు..
ఇక మరో తొలి సంతకం ద్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మాటిచ్చి 5 ఏళ్లు అధికారం లో ఉండి ఒక్క రూపాయి రుణమాఫీ చేయకపోగా చేయమని అడిగితే అది సాధ్యం కాదని అసెంబ్లీ సాక్షిగా మంత్రిగా ఉన్న పరిటాల సునీత ప్రకటించింది. 2019 ఎన్నికల కు ముందు మహిళలను మరోసారి మోసం చేయాలని డ్వాక్రా రుణమాఫీ చేయలేదని వారు కోపం లో ఉన్నారని గ్రహించి పసుపు-కుంకున పేరుతో చేసిన మోసం దెప్పి కొట్టింది.. ఇక చేనేత రుణమాఫీ విషయానికి వస్తే ఐదేళ్లలో బాబు రుణమాఫీ చేసిన చేనేత కుటుంబాలు మొత్తంగా 2000 మాత్రమే..
ఇక ఎన్టీఆర్ సుజల స్రవంతి పేర ఇంటింటికీ ఉచితంగా రక్షిత నల్లా నీరు అందిస్తాం అని మాటిచ్చి అధికారంలోకి రాగానే ఆ పథకం అమలు ప్రభుత్వం చేయలేదని, ఆసక్తి ఉన్న టీడీపీ నాయకులే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని పిలుపునివ్వగా, రాష్ట్రం మొత్తం మీద కేవలం 48 ప్లాంట్ లు మాత్రమే ఏర్పాటు అయ్యాయి… ఇప్పుడు మళ్లీ ఇంటింటికి త్రాగునీరు అంటూ సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ అదే హామీ, అవ్వాలి చెల్లికి పెళ్లి మళ్లీ మళ్లీ అన్న చందాన ప్రవర్తిస్తున్నాడు..
ఇప్పుడు మళ్లీ తొలిసంతకం మెగా డీఎస్సీ పై చేస్తా అంటూ నిరుద్యోగుల గొంతు కోయడానికి సిద్ధమయ్యాడు. 2014-19 మధ్య ఐదేళ్లలో ఒకేఒకసారి 2018 లో డీఎస్సీ వేయగా, నియామకాలు కూడా పూర్తి చేయలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాకే కోర్ట్ కేసులని క్లియర్ చేసేవిధంగా ప్రత్యేక దృష్టి పెట్టి 6954 మంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు…
ఆయన హామీలే ఇస్తారు. అమలు చేయరు…. నమ్మారా ఆత్మహత్యా సదృశ్యమే…