చంద్రబాబు చెప్పింది చేయడు అనే మాటను నిజం చేస్తూ మరోసారి తన అసల రూపాన్ని బయటపెట్టాడు బాబు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటన చేస్తూ వేగంగా అడుగులు వేస్తున్నాయి, ఆ తరుణంలో చంద్రబాబు తమ అభ్యర్థులను ఒక సీట్లు మినహా అన్ని స్థానాలకు ప్రకటించాడు. చంద్రబాబు ప్రకటించిన 3 జాబితాలో కలిపి బీసీలకు 31 ఎమ్మెల్యే, 4 ఎంపీ ప్రకటించాడు. బీసీ డిక్లరేషన్ కార్యక్రమం నిర్వహణ తర్వాత ఈ జాబితాలను వెల్లడించాడు. బీసీ డిక్లరేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం, గతంలో సీట్లు ఇవ్వకుండా తప్పులు చేశాం ఈసారి పొరపాటు జరగకుండా చూసుకుంటాం అని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన 10 రోజులకే ఆ మాటలను మరిచాడు.బీసీలు అధికంగా ఉండే చోటు కూడా బీసీలకు సీట్లు కేటాయించలేదు.
జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు నుంచే బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్తూ ఉండేవారు. అదే మాటను నిజం చేస్తూ బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా 2024 ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ సీట్లు కేటాయించారు. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికలకు మించి ఈ ఎన్నికలకు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించింది. 2019లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు 48 కేటాయిస్తే , ఈసారి వీటికి మరో పదకొండు జత చేస్తూ 59 సీట్లు కేటాయించింది ప్రభుత్వం.ఇందులో 11 ఎంపీ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టిడిపి మాత్రం 4 ఎంపీ, 31 ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టేశాడు నారా చంద్రబాబు నాయుడు. ఇంకా ఏ విధంగా రాజ్యాధికారం బీసీలకు కల్పిస్తాడు బాబు. బీసీలు ఎక్కువగా ఉండే చోటు కూడా బీసీలకు కేటాయించలేని అసమర్థ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అసెంబ్లీ , పార్లమెంట్ పక్కన పెడితే రాజ్యసభకు, మండలిలో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు బాబు. ఆంధ్ర ప్రదేశ్ కి 11 రాజ్యసభ సీట్లు ఉంటే 4 సీట్లు బీసీలకు కేటాయించింది వైఎస్ఆర్సీపీ,40 ఏళ్ల చరిత్రలో కనీసం నలుగురు కూడా రాజ్యసభకు పంపలేదు టీడీపీ, ఇంకా ఏ విధంగా టీడీపీ బీసీల పార్టీ అవుతుంది. మండలి లో కూడా ఇదే తరహాలో సరైన గౌరవం దక్కకుండా చేశాడు బాబు.
బీసీలు అధికంగా ఉండే చోటు కూడా తన సామాజిక వర్గానికి కేటాయించికున్నాడు బాబు.ఇదే అంశం పై బీసీ నేతలు అందరూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. చంద్రబాబు పై నిరసనగా ఆ పార్టీ బీసీ నేతలు ఆందోళనలు చేస్తూ తిడుతూనే, మరోవైపు అత్యధిక సీట్లు కేటాయించిన జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు.ఈ సారి బీసీలు అందరూ జగన్ మోహన్ రెడ్డి వైపు నిలబడాలని ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ నేతలు తెలియజేస్తున్నారు.